సాయి ధరమ్ తేజ్ కు ఆపరేషన్ విజయవంతం..ఊపిరి పీల్చుకున్న అభిమానులు
- September 12, 2021
రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ సాయి ధరమ్ తేజ్ కాలర్ బోన్ ఆపరేషన్ సక్సెస్ అయింది. మరో 24 గంటలు వెంటిలేటర్ పైనే సాయి తేజ్కి ట్రీట్మెంట్ అందించనున్నారు. నిరంతరం డాక్టర్స్ పర్యవేక్షణలో ఆయన ఉంటారని , ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు పేర్కొన్నారు.
ప్రమాద సమయంలో సాయి ధరమ్కి కాలర్ బోన్ ఫ్రాక్చర్, కన్ను, ఛాతి భాగంలో గాయాలయ్యాయి. శరీరం లోపల మాత్రం ఎలాంటి రక్తస్రావం లేదని అపోలో వైద్యులు తెలిపారు. ఇక హీరో రామ్చరణ్, నిర్మాత అల్లు అరవింద్ అపోలో ఆస్పత్రికి చేరుకుని తేజ్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని తెలుసుకుంటున్నారు.

తాజాగా విడుదలైన హెల్త్ బులిటెన్తో అభిమానులలో కాస్త ఆందోళన తగ్గింది. సాయి తేజ్ త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్ధనలు చేస్తున్నారు. కాగా, సాయి ధరమ్కి సంబంధించిన వీడియో ఒకటి బయటకు రాగా,ఆయన నొప్పి అని అనడం కనిపించింది. త్వరలోనే ఆయన కోలుకుంటారని ప్రతి ఒక్కరు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- అమెరికాలో 11 ఏళ్ల తెలుగు బాలిక అద్భుత ఘనత..
- కరీంనగర్లో మినిస్టర్ వైట్ షోరూమ్ ప్రారంభం
- ఖతార్లో డిజిటల్ చైల్డ్ ప్రొటెక్షన్ చట్టంపై కేబినెట్ రివ్యూ..!!
- కొత్తగా స్థాపించిన వ్యాపారాలకు వీసాలు తగ్గించిన సౌదీ..!!
- డొమెస్టిక్ వర్కర్ పర్మిట్ సర్వీస్ అప్డేట్: LMRA
- అల్ జబల్ అల్ అఖ్దర్ ఫెస్టివల్ 2026.. వివరాలు వెల్లడి..!!
- కువైట్ ఎయిర్ కార్గోలో డ్రగ్ స్మగ్లింగ్ ప్రయత్నం భగ్నం..!!
- దుబాయ్ షేక్ జాయెద్ రోడ్లోని భవనంలో అగ్నిప్రమాదం..!!
- జాయింట్ భద్రతా ప్రాజెక్టుల్లో డేటా రక్షణకు యూఏఈ–ఖతర్ అవగాహన ఒప్పందం
- వాట్సాప్లో అద్భుతమైన ఫీచర్..









