అది అయిదో టెస్టుగానే ఉండాలి: గంగూలీ
- September 14, 2021
దిల్లీ: కరోనా భయాల వల్ల భారత్, ఇంగ్లాండ్ మధ్య అర్ధంతరంగా ఆగిపోయిన అయిదో టెస్టును తిరిగి ఎప్పుడు నిర్వహించినా.. అది ఈ సిరీస్లో భాగంగానే ఉండాలన్నది తమ అభిమతమని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ స్పష్టం చేశాడు. అయిదు టెస్టుల సిరీస్లో భాగంగా చివరిదైన ఈ మ్యాచ్ ఈ నెల 10న మాంచెస్టర్లో ఆరంభం కావాల్సింది. అయితే భారత సహాయ బృందంలో నలుగురు కరోనా బారిన పడటంతో మైదానంలోకి దిగేందుకు కోహ్లీసేన నిరాకరించింది. దీంతో మ్యాచ్ రద్దు చేశారు. ఈ మ్యాచ్ను రీషెడ్యూల్ చేయాలని చూస్తున్న నేపథ్యంలో గంగూలీ స్పందిస్తూ..
''ప్రస్తుత సిరీస్ పూర్తిగా జరగాలి. ఇందులో విజయం సాధిస్తే.. 2007 తర్వాత తొలి సిరీస్ గెలుపవుతుంది. ప్రస్తుతం ఆగిపోయిన టెస్టు మ్యాచ్ ఎప్పుడు జరిగినా.. అది ఈ సిరీస్లో అయిదో టెస్టుగానే ఉండాలన్నది మా అభిమతం'' అని గంగూలీ అన్నాడు.
తాజా వార్తలు
- తమిళనాడు అసెంబ్లీలో హైడ్రామా..బలపరీక్ష నెగ్గిన విజయ్ ప్రభుత్వం..
- పుదుచ్చేరి సీఎంగా రంగసామి రికార్డు
- గల్ఫ్ ఎయిర్ ప్రయాణికులకు అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్..!!
- ఎస్టోనియా, డచ్ మంత్రులతో సయ్యద్ బదర్ చర్చలు..!!
- ప్రాంతీయ భద్రతా పై చర్చించిన సౌదీ, ఖతార్..!!
- ఇరాన్ తో సంబంధం ఉన్న సముద్ర చొరబాటుదారులు అరెస్ట్..!!
- 21 మంది వ్యక్తులు, సంస్థలను ఉగ్రవాదుల జాబితాలో చేర్చిన యూఏఈ..!!
- Metrash ద్వారా QPost ట్రాకింగ్ సేవలు..!!
- కష్టపడే వారికే పదవులు: కేసీఆర్
- ఉత్తర అల్ బతీనాహ్లో అంబులెన్స్ ప్రమాదం









