అది అయిదో టెస్టుగానే ఉండాలి: గంగూలీ
- September 14, 2021
దిల్లీ: కరోనా భయాల వల్ల భారత్, ఇంగ్లాండ్ మధ్య అర్ధంతరంగా ఆగిపోయిన అయిదో టెస్టును తిరిగి ఎప్పుడు నిర్వహించినా.. అది ఈ సిరీస్లో భాగంగానే ఉండాలన్నది తమ అభిమతమని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ స్పష్టం చేశాడు. అయిదు టెస్టుల సిరీస్లో భాగంగా చివరిదైన ఈ మ్యాచ్ ఈ నెల 10న మాంచెస్టర్లో ఆరంభం కావాల్సింది. అయితే భారత సహాయ బృందంలో నలుగురు కరోనా బారిన పడటంతో మైదానంలోకి దిగేందుకు కోహ్లీసేన నిరాకరించింది. దీంతో మ్యాచ్ రద్దు చేశారు. ఈ మ్యాచ్ను రీషెడ్యూల్ చేయాలని చూస్తున్న నేపథ్యంలో గంగూలీ స్పందిస్తూ..
''ప్రస్తుత సిరీస్ పూర్తిగా జరగాలి. ఇందులో విజయం సాధిస్తే.. 2007 తర్వాత తొలి సిరీస్ గెలుపవుతుంది. ప్రస్తుతం ఆగిపోయిన టెస్టు మ్యాచ్ ఎప్పుడు జరిగినా.. అది ఈ సిరీస్లో అయిదో టెస్టుగానే ఉండాలన్నది మా అభిమతం'' అని గంగూలీ అన్నాడు.
తాజా వార్తలు
- కూలిన మిలిటరీ హెలికాప్టర్: ఆరుగురు మృతి
- ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమరం!
- యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో కీలక పరిణామం..
- గల్ఫ్లో ఇరాన్ ప్రతీకారం..అమెరికా రాడార్ వ్యవస్థలు ధ్వంసం
- ఇరాన్ దాడులు..పబ్లిక్ హెల్త్ పై డబ్ల్యూహెచ్ఓ ఆందోళన..!!
- పిల్లిని రక్షించడానికి ప్రాణాలను పణంగా పెట్టిన వ్యక్తి..!!
- దమ్మామ్ మీదుగా కైరోకు.. కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- వెహికల్ నాయిస్ లిమిట్స్, మోడిఫికేషన్ పై హెచ్చరిక జారీ..!!
- జర్మన్ విదేశాంగ మంత్రితో GCC దేశాల మినిస్టర్స్ భేటీ..!!
- ఇరాన్ సైనిక అటాచీలను బహిష్కరించిన సౌదీ అరేబియా..!!









