అది అయిదో టెస్టుగానే ఉండాలి: గంగూలీ

- September 14, 2021 , by Maagulf
అది అయిదో టెస్టుగానే ఉండాలి: గంగూలీ

దిల్లీ: కరోనా భయాల వల్ల భారత్‌, ఇంగ్లాండ్‌ మధ్య అర్ధంతరంగా ఆగిపోయిన అయిదో టెస్టును తిరిగి ఎప్పుడు నిర్వహించినా.. అది ఈ సిరీస్‌లో భాగంగానే ఉండాలన్నది తమ అభిమతమని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ స్పష్టం చేశాడు. అయిదు టెస్టుల సిరీస్‌లో భాగంగా చివరిదైన ఈ మ్యాచ్‌ ఈ నెల 10న మాంచెస్టర్‌లో ఆరంభం కావాల్సింది. అయితే భారత సహాయ బృందంలో నలుగురు కరోనా బారిన పడటంతో మైదానంలోకి దిగేందుకు కోహ్లీసేన నిరాకరించింది. దీంతో మ్యాచ్‌ రద్దు చేశారు. ఈ మ్యాచ్‌ను రీషెడ్యూల్‌ చేయాలని చూస్తున్న నేపథ్యంలో గంగూలీ స్పందిస్తూ..

''ప్రస్తుత సిరీస్‌ పూర్తిగా జరగాలి. ఇందులో విజయం సాధిస్తే.. 2007 తర్వాత తొలి సిరీస్‌ గెలుపవుతుంది. ప్రస్తుతం ఆగిపోయిన టెస్టు మ్యాచ్‌ ఎప్పుడు జరిగినా.. అది ఈ సిరీస్‌లో అయిదో టెస్టుగానే ఉండాలన్నది మా అభిమతం'' అని గంగూలీ అన్నాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com