మోడీ - బైడెన్ ముఖాముఖీ కి డేటు ఖరారు
- September 14, 2021
ఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోడీ అమెరికా పర్యటన ఖరారైంది. వచ్చేవారం ఆయన రెండు రోజుల పాటు అగ్రరాజ్యంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆ దేశాధ్యక్షుడు జో బైడెన్ ఆతిథ్యంలో జరగనున్న క్వాడ్ నేతల సదస్సులో మోడీ పాల్గొననున్నారు. దీంతో పాటు ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలోనూ ప్రసంగించనున్నట్లు కేంద్ర విదేశాంగ శాఖ మంగళవారం వెల్లడించింది. సెప్టెంబరు 24న వాషింగ్టన్లో మోడీ, బైడెన్, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్, జపాన్ ప్రధాని యోషిహిడే సుగా మధ్య క్వాడ్ సదస్సు జరగనుందని విదేశాంగశాఖ తమ ప్రకటనలో పేర్కొంది. ఆ తర్వాత సెప్టెంబరు 25న న్యూయార్క్ వేదికగా ఐరాస సర్వసభ్య సమావేశం 76వ సెషన్లో జరిగే 'జనరల్ డిబేట్'లో ప్రధాని పాల్గొని కీలక ప్రసంగం చేయనున్నట్లు తెలిపింది.
తాజా వార్తలు
- కువైట్ తొలి ఫ్యామిలీ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్ కు కేబినెట్ ఆమోదం..!!
- తమిళనాడు అసెంబ్లీలో హైడ్రామా..బలపరీక్ష నెగ్గిన విజయ్ ప్రభుత్వం..
- పుదుచ్చేరి సీఎంగా రంగసామి రికార్డు
- గల్ఫ్ ఎయిర్ ప్రయాణికులకు అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్..!!
- ఎస్టోనియా, డచ్ మంత్రులతో సయ్యద్ బదర్ చర్చలు..!!
- ప్రాంతీయ భద్రతా పై చర్చించిన సౌదీ, ఖతార్..!!
- ఇరాన్ తో సంబంధం ఉన్న సముద్ర చొరబాటుదారులు అరెస్ట్..!!
- 21 మంది వ్యక్తులు, సంస్థలను ఉగ్రవాదుల జాబితాలో చేర్చిన యూఏఈ..!!
- Metrash ద్వారా QPost ట్రాకింగ్ సేవలు..!!
- కష్టపడే వారికే పదవులు: కేసీఆర్









