వలస విద్యార్థులంతా రెసిడెంట్ కార్డులు పొందాలి
- September 14, 2021
ఒమన్: వలస విద్యార్థులంతా రెసిడెంట్ కార్డుని రాయల్ ఒమన్ పోలీస్ నుంచి పొందాలని మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ స్పష్టం చేసింది. పరముఖ ప్రైవేట్ స్కూళ్ళు, కమ్యూనిటీ స్కూళ్ళు ఇప్పటికే విద్యార్థుల తల్లిదండ్రులకు ఈ విషయమై సమాచారం అందించాయి. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ జారీ చేసిన కొత్త విధి విధానాల్ని విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియజేశాయి. ఇండియన్ స్కూల్స్ అన్నీ ఇప్పటికే తమ విద్యార్థులకు రెసిడెంట్ కార్డు విషయమై సమాచారం అందించడంతోపాటు, దీనికి సంబంధించిన రికార్డుని మెయిన్టెయిన్ చేస్తున్నట్లు ఇండియన్ స్కూల్ మస్కట్ పేర్కొంది. విద్యార్థుల తల్లిదండ్రులు రెసిడెంట్ కార్డు జిరాక్సుని స్కూలుకి సమర్పించాల్సి వుంటుంది. కొత్తగా అడ్మిషన్లు కోరే తల్లిదండ్రులు తప్పనిసరిగా తమ పిల్లలకు సంబంధించిన రెసిడెంట్ కార్డుని జత చేయాల్సి వుంటుందని సూచించారు. గతంలో 15 ఏళ్ళ లోపు వలస చిన్నారులకు, రెసిడెంట్ కార్డ్ అవసరం లేదు. కానీ, కొత్త రూల్ ప్రకారం 4 ఏళ్ళ చిన్నారులు కూడా రెసిడెంట్ కార్డు కలిగి వుండాలి. కాగా, 12 ఏళ్ళ లోపు చిన్నారులకు వ్యాక్సినేషన్ చేయనున్నారు. అలాగే వ్యాక్సినేషన్ కోసం రెసిడెంట్ కార్డుని తప్పనిసరి చేస్తారు.
తాజా వార్తలు
- గల్ఫ్ ఎయిర్ ప్రయాణికులకు అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్..!!
- ఎస్టోనియా, డచ్ మంత్రులతో సయ్యద్ బదర్ చర్చలు..!!
- ప్రాంతీయ భద్రతా పై చర్చించిన సౌదీ, ఖతార్..!!
- ఇరాన్ తో సంబంధం ఉన్న సముద్ర చొరబాటుదారులు అరెస్ట్..!!
- 21 మంది వ్యక్తులు, సంస్థలను ఉగ్రవాదుల జాబితాలో చేర్చిన యూఏఈ..!!
- Metrash ద్వారా QPost ట్రాకింగ్ సేవలు..!!
- కష్టపడే వారికే పదవులు: కేసీఆర్
- ఉత్తర అల్ బతీనాహ్లో అంబులెన్స్ ప్రమాదం
- IPL 2026: సన్రైజర్స్ హైదరాబాద్ పై గుజరాత్ టైటాన్స్ ఘన విజయం
- అనుమతి లేని ఎయిర్లైన్స్తో టికెట్లు బుక్ చేయవద్దు: కువైట్ DGCA హెచ్చరిక









