వలస విద్యార్థులంతా రెసిడెంట్ కార్డులు పొందాలి
- September 14, 2021
ఒమన్: వలస విద్యార్థులంతా రెసిడెంట్ కార్డుని రాయల్ ఒమన్ పోలీస్ నుంచి పొందాలని మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ స్పష్టం చేసింది. పరముఖ ప్రైవేట్ స్కూళ్ళు, కమ్యూనిటీ స్కూళ్ళు ఇప్పటికే విద్యార్థుల తల్లిదండ్రులకు ఈ విషయమై సమాచారం అందించాయి. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ జారీ చేసిన కొత్త విధి విధానాల్ని విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియజేశాయి. ఇండియన్ స్కూల్స్ అన్నీ ఇప్పటికే తమ విద్యార్థులకు రెసిడెంట్ కార్డు విషయమై సమాచారం అందించడంతోపాటు, దీనికి సంబంధించిన రికార్డుని మెయిన్టెయిన్ చేస్తున్నట్లు ఇండియన్ స్కూల్ మస్కట్ పేర్కొంది. విద్యార్థుల తల్లిదండ్రులు రెసిడెంట్ కార్డు జిరాక్సుని స్కూలుకి సమర్పించాల్సి వుంటుంది. కొత్తగా అడ్మిషన్లు కోరే తల్లిదండ్రులు తప్పనిసరిగా తమ పిల్లలకు సంబంధించిన రెసిడెంట్ కార్డుని జత చేయాల్సి వుంటుందని సూచించారు. గతంలో 15 ఏళ్ళ లోపు వలస చిన్నారులకు, రెసిడెంట్ కార్డ్ అవసరం లేదు. కానీ, కొత్త రూల్ ప్రకారం 4 ఏళ్ళ చిన్నారులు కూడా రెసిడెంట్ కార్డు కలిగి వుండాలి. కాగా, 12 ఏళ్ళ లోపు చిన్నారులకు వ్యాక్సినేషన్ చేయనున్నారు. అలాగే వ్యాక్సినేషన్ కోసం రెసిడెంట్ కార్డుని తప్పనిసరి చేస్తారు.
తాజా వార్తలు
- వాట్సాప్కు ధీటైన స్వదేశీ యాప్!
- భవిష్యత్తు అంతా AI: సీఎం చంద్రబాబు
- కూలిన మిలిటరీ హెలికాప్టర్: ఆరుగురు మృతి
- ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమరం!
- యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో కీలక పరిణామం..
- గల్ఫ్లో ఇరాన్ ప్రతీకారం..అమెరికా రాడార్ వ్యవస్థలు ధ్వంసం
- ఇరాన్ దాడులు..పబ్లిక్ హెల్త్ పై డబ్ల్యూహెచ్ఓ ఆందోళన..!!
- పిల్లిని రక్షించడానికి ప్రాణాలను పణంగా పెట్టిన వ్యక్తి..!!
- దమ్మామ్ మీదుగా కైరోకు.. కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- వెహికల్ నాయిస్ లిమిట్స్, మోడిఫికేషన్ పై హెచ్చరిక జారీ..!!









