సైదాబాద్ నిందితుడిపై రూ.10 లక్షల రివార్డ్: సీపీ అంజనీ కుమార్
- September 14, 2021
హైదరాబాద్: హైదరాబాద్ నడిబొడ్డులోని సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య ఘటన తీవ్ర కలకలం రేపుతోంది… ఘటన జరిగి వారం కావస్తున్నా.. నిందితుడు ఆచూకీ ఇప్పటి వరకు లభించలేదు.. దీంతో.. హైదరాబాద్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు.. సైదాబాద్ చిన్నారి కేసుపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ నేతృత్వంలో సమావేశం జరిగింది.. నిందితుడి కోసం 100 మంది పోలీసులతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.. 10 పోలీసు బృందాలతో నిందితుడికోసం వేట కొనసాగుతోందని తెలిపారు. ఇదే సమయంలో.. మరో కీలక నిర్ణయం తీసుకున్నారు హైదరాబాద్ పోలీసులు.. ఈ కేసులో నిందితుడిగా ఉన్న రాజు ఆచూకీ తెలిపితే రూ.10 లక్షలు రివార్డ్ అందించనున్నట్టు ప్రకటించారు.. నిందితుడి సమాచారం తెలిస్తే 94906 16366, 94906 16627 నంబర్లకు సమాచారం ఇవ్వాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.. ఇక, ఆచూకీ తెలిపినవారి వివరాల్ని గోప్యంగా ఉంచుతామని తెలిపారు హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్.

తాజా వార్తలు
- శోభాయాత్ర ప్రశాంతంగా సాగేలా ఏర్పాటు చేస్తున్నాం: సీపీ సజ్జనార్
- రోహిత్ రెడ్డికి 3 రోజుల పోలీస్ కస్టడీ..కోర్టు కీలక ఆదేశాలు!
- యుద్ధం పై ట్రంప్ కీలక ప్రకటన.. 5 రోజులు బ్రేక్
- ఏపీలో మెగా స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు
- దుబాయ్కు జజీరా ఎయిర్వేస్ విమాన సర్వీసులు పునఃప్రారంభం
- మూడు జోన్లుగా భాగ్యనగరం..సీఎం రేవంత్
- భూ మార్గాల ద్వారా కార్గో మళ్లింపు..కువైట్ కస్టమ్..!!
- ఖతార్ నేషనల్ లైబ్రరీ రీ ఓపెన్..టైమింగ్స్ ఇవే..!!
- రష్యన్ ఉప విదేశాంగ మంత్రితో బహ్రెయిన్ రాయబారి భేటీ..!!
- యూఏఈలో పెట్రోల్ ధరలు ఎంత మేర పెరగవచ్చు?









