ఉపరాష్ట్రపతిని కలిసిన చిన్న జీయర్ స్వామి
- September 14, 2021
న్యూఢిల్లీ: సమాజంలో అంటరానితనాన్ని, వివక్షను రూపు మాపి సమానత్వ సాధన కోసం కృషి చేసిన భగవద్రామానుజుల వారు ఆధ్యాత్మికవేత్తగానే గాక, సామాజిక సంస్కరణాభిలాషిగా సమాజంపై చెరగని ముద్ర వేశారని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు తెలిపారు. మంగళవారం నాడు న్యూఢిల్లీలోని ఉపరాష్ట్రపతి నివాసానికి త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి వారు విచ్చేశారు. హైదరాబాద్ ముచ్చింతల్ లో 2022 ఫిబ్రవరిలో జరగనున్న 216 అడుగుల సమతా విగ్రహం (స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ) ఆవిష్కరణ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి దంపతులకు ఆహ్వానాన్ని అందజేశారు.

సమాజంలో నెలకొన్న వివక్షకు వ్యతిరేకంగా వేయి సంవత్సరాల క్రితమే ఆచరణాత్మక విప్లవాన్ని సృష్టించిన భగవద్రామానుజులు ఆదర్శనీయులన్న ఉపరాష్ట్రపతి, భగవంతుడు అందరివాడు అంటూ వారు చూపిన మార్గం ఆచరణీయమని తెలిపారు. సామాజిక చైతన్య ప్రబోధకులైన రామానుజుల వారి అతిపెద్ద ప్రతిమను ఏర్పాటు చేయడం ద్వారా, వారి బోధనలు, సందేశం ప్రపంచ వ్యాప్తంగా విస్తరించేందుకు అవకాశం ఉంటుందని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మై హోమ్ గ్రూప్స్ అధినేత జూపల్లి రామేశ్వరరావు, ధనుష్ ఇన్ఫోటెక్ సి.ఎం.డి. డి.ఎస్.ఎన్. మూర్తి తదితరులు పాల్గొన్నారు.

తాజా వార్తలు
- కష్టపడే వారికే పదవులు: కేసీఆర్
- ఉత్తర అల్ బతీనాహ్లో అంబులెన్స్ ప్రమాదం
- IPL 2026: సన్రైజర్స్ హైదరాబాద్ పై గుజరాత్ టైటాన్స్ ఘన విజయం
- అనుమతి లేని ఎయిర్లైన్స్తో టికెట్లు బుక్ చేయవద్దు: కువైట్ DGCA హెచ్చరిక
- ట్రాన్స్జెండర్ల సంక్షేమానికి ఏపీ ప్రభుత్వం కీలక అడుగు
- రష్యా వీసా ఖర్చుల భారం లేకుండా ట్రిప్ ప్లాన్
- యూఏఈలో రేపటి వాతావరణం ప్రశాంతం
- ఆన్లైన్ క్లాసులు నిర్వహించండి..స్కూళ్లకు ప్రధాని మోదీ కీలక విజ్ఞప్తి
- భారత దేశవ్యాప్తంగా NEET పరీక్ష రద్దు..కేంద్రం సంచలన నిర్ణయం
- తమిళనాడులో సీఎం విజయ్ షణ్ముగంతో కీలక భేటీ









