భారత్‌లో కరోనా కేసుల వివరాలు

- September 15, 2021 , by Maagulf
భారత్‌లో కరోనా కేసుల వివరాలు

న్యూ ఢిల్లీ: భారత్‌లో క‌రోనా కేసులు క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. తాజాగా కేంద్రం క‌రోనా బులిటెన్‌ను రిలీజ్ చేసింది. ఈ బులిటెన్ ప్ర‌కారం దేశంలో కొత్త‌గా 27,176 కేసులు న‌మోద‌య్యాయి. దీంతో దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన కేసుల సంఖ్య 3,33,16,755కి చేరింది. ఇందులో 3,25,22,171 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 3,51,087 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక‌పోతే, గ‌డిచిన 24 గంట‌ల్లో ఇండియాలో క‌రోనాతో 284 మంది మృతి చెందారు. దీంతో ఇండియాలో ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 4,43,497 కి చేరింది. గ‌డిచిన 24 గంట‌ల్లో ఇండియాలో 38,012 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇక, ఇప్పటి వరకు 75,89,12,277 డోసుల వ్యాక్సిన్‌ను పంపిణీ చేశామని ప్రకటించింది ప్రభుత్వం. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com