సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నవీన్ పొలిశెట్టి కొత్త చిత్రం

- September 15, 2021 , by Maagulf
సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నవీన్ పొలిశెట్టి కొత్త చిత్రం

యంగ్ హీరో నవీన్ పొలిశెట్టితో ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ కొత్త చిత్రం నిర్మించబోతున్నట్టు అధికారకంగా ప్రకటించింది. 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ', 'జాతి రత్నాలు' వంటి సినిమాలతో వరుస హిట్స్ అందుకొని టాలీవుడ్‌లో క్రేజీ హీరోగా మారాడు నవీన్. 'జాతి రత్నాలు' తర్వాత వరుసగా సినిమాలను కమిటవుతున్నాడు. ఈ క్రమంలోనే సితార ఎంటర్టైన్మెంట్స్ వారితోనూ ఓ సినిమా చేయనున్నాడు. కళ్యాణ్ శంకర్ ఈ మూవీ ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సొంత బ్యానర్ ఫార్చ్యూన్ 4 సినిమాస్ కూడా చిత్ర నిర్మాణంలో భాగస్వామ్యం అవుతోంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com