వదిలివేయబడ్డ ఇళ్ళ వ్యవహారంపై సుల్తాన్ ఆదేశాలు
- September 15, 2021
షార్జా: షార్జా రూలర్, సుప్రీం కౌన్సిల్ మెంబర్ డాక్టర్ షేక్ సుల్తాన్ బిన్ మొహమ్మద్ అల్ కాసిమి, షార్జాలో వదిలివేయబడ్డ ఇళ్ళ విషయమై షార్జా డిప్యూటీ రూలర్, ఛైర్మన్ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ షేక్ సుల్తాన్ బిన్ మొహమ్మద్ బిన్ సుల్తాన్ అల్ కాసిమికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. షార్జా మునిసిపాలిటీ తరఫున ఏర్పాటైన కమిటీ, ఆ ఇళ్ళ సంఖ్యను లెక్కిస్తోంది. వాటికి సంబంధించిన సమస్యల్ని గుర్తిస్తోంది. షార్జా అభివృద్ధిపై షేక్ సుల్తాన్ ఇప్పటికే పలు చర్యలు తీసుకున్నారు. 2022 సంవత్సరాన్ని కల్బాగా, ఆ తర్వాత వచ్చే ఏడాదిని అల్ ధయిద్గా సుల్తాన్ పేర్కొన్నారు. ప్రతి 6 నుంచి 8 నెలలకు ఓ సారి ఓ పెద్ద కొత్త ప్రాజెక్టుని ప్రారంభించనున్నట్లు సుల్తాన్ వెల్లడించారు. షార్జాని అన్ని రకాలుగా మరింత అభివృద్ధి చేయాల్సి వుందని ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- కువైట్ లో భద్రతకు చెక్ పాయింట్లు కీలకం..!!
- ఇబ్రిలో అగ్నిప్రమాదం..తప్పిన పెను ప్రమాదం..!!
- బహ్రెయిన్ లో యూఏఈ సైనికుడు మృతి..!!
- ఒమన్ సుల్తాన్కు సంతాపం తెలిపిన కింగ్ సల్మాన్, క్రౌన్ ప్రిన్స్..!!
- షకీరా దోహా కాన్సర్ట్ వాయిదా..!!
- యూఏఈ ఆధ్వర్యంలో ఆఫ్గాన్ చెరనుంచి అమెరికన్ విడుదల..!!
- భారత్ లోనే తొలి కారుణ్య మరణం కేసు..
- హైదరాబాద్కు 915 ఎలక్ట్రిక్ బస్సులు
- కువైట్ ఎయిర్వేస్ ప్రయాణికులకు శుభవార్త
- సీఎం చంద్రబాబుతో బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ భేటీ









