వదిలివేయబడ్డ ఇళ్ళ వ్యవహారంపై సుల్తాన్ ఆదేశాలు
- September 15, 2021
షార్జా: షార్జా రూలర్, సుప్రీం కౌన్సిల్ మెంబర్ డాక్టర్ షేక్ సుల్తాన్ బిన్ మొహమ్మద్ అల్ కాసిమి, షార్జాలో వదిలివేయబడ్డ ఇళ్ళ విషయమై షార్జా డిప్యూటీ రూలర్, ఛైర్మన్ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ షేక్ సుల్తాన్ బిన్ మొహమ్మద్ బిన్ సుల్తాన్ అల్ కాసిమికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. షార్జా మునిసిపాలిటీ తరఫున ఏర్పాటైన కమిటీ, ఆ ఇళ్ళ సంఖ్యను లెక్కిస్తోంది. వాటికి సంబంధించిన సమస్యల్ని గుర్తిస్తోంది. షార్జా అభివృద్ధిపై షేక్ సుల్తాన్ ఇప్పటికే పలు చర్యలు తీసుకున్నారు. 2022 సంవత్సరాన్ని కల్బాగా, ఆ తర్వాత వచ్చే ఏడాదిని అల్ ధయిద్గా సుల్తాన్ పేర్కొన్నారు. ప్రతి 6 నుంచి 8 నెలలకు ఓ సారి ఓ పెద్ద కొత్త ప్రాజెక్టుని ప్రారంభించనున్నట్లు సుల్తాన్ వెల్లడించారు. షార్జాని అన్ని రకాలుగా మరింత అభివృద్ధి చేయాల్సి వుందని ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ట్రక్కులకు కార్గో డాక్యుమెంట్స్ తప్పనిసరి..!!
- కువైట్ తొలి ఫ్యామిలీ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్ కు కేబినెట్ ఆమోదం..!!
- తమిళనాడు అసెంబ్లీలో హైడ్రామా..బలపరీక్ష నెగ్గిన విజయ్ ప్రభుత్వం..
- పుదుచ్చేరి సీఎంగా రంగసామి రికార్డు
- గల్ఫ్ ఎయిర్ ప్రయాణికులకు అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్..!!
- ఎస్టోనియా, డచ్ మంత్రులతో సయ్యద్ బదర్ చర్చలు..!!
- ప్రాంతీయ భద్రతా పై చర్చించిన సౌదీ, ఖతార్..!!
- ఇరాన్ తో సంబంధం ఉన్న సముద్ర చొరబాటుదారులు అరెస్ట్..!!
- 21 మంది వ్యక్తులు, సంస్థలను ఉగ్రవాదుల జాబితాలో చేర్చిన యూఏఈ..!!
- Metrash ద్వారా QPost ట్రాకింగ్ సేవలు..!!









