యాదాద్రి ఆలయ విస్తరణ.. భూములు కోల్పోయిన నిర్వాసితుల ఆందోళన
- September 16, 2021
యాదాద్రి ఆలయ విస్తరణలో భూములు కోల్పోయిన నిర్వాసితులు ఆందోళన బాట పట్టారు. పరిహారం ఎందుకు చెల్లించడం లేదని అధికారుల్ని నిలదీస్తూ... అభివృద్ధి పనుల్ని అడ్డుకున్నారు. ఇల్లుకు ఇల్లు, స్థలానికి స్థలం ఇస్తామన్న కేసీఆర్ హామీ ఏమైందని ప్రశ్నించారు. సీఎం ఆదేశాలను అధికారులు పాటించడం లేదా?... అధికారులతో సీఎం అలా చెప్పిస్తున్నారా?.. అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం దిగిరాకపోతే సీఎం నివాసం వరకు పాదయాత్ర చేస్తామని స్పష్టంచేశారు.
యాదాద్రి కొండ చుట్టూ నాలుగు లేన్ల రోడ్డు కోసం ప్రభుత్వం భూమి సేకరించింది. అంజనాపురిలో స్థానికులు 50 ఇళ్లు కోల్పోయారు. వీరికి ప్రభుత్వం స్థలాలు కేటాయించింది. బ్యాంకు ఖాతాల్లో పరిహారం జమ చేసింది. కానీ.. ఖాళీ స్థలాలు కోల్పోయిన 120 మంది నిర్వాసితులకు పరిహారం అందలేదని బాధితులు మండిపడ్డారు. సీఎం కేసీఆర్ హామీ ప్రకారం సైదాపురంలో స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు.
తాజా వార్తలు
- యూఏఈలో కొనసాగుతున్న వర్షాలు..దుబాయ్, షార్జాలో గరిష్ట ఉష్ణోగ్రత 25°C..!!
- ఇబ్రి నీట మునిగి ఇద్దరు ఒమన్ మహిళలు మృతి..!!
- జీసీసీకి ఫుడ్ సఫ్లై..ప్రధాని మోదీతో లూలూ ఛైర్మన్ భేటీ..!!
- గ్రీన్ లేన్ల యాక్టివేట్ కు జీసీసీ చర్యలు..!!
- హమద్ బిన్ ఖలీఫా మెడికల్ సిటీ రూట్స్ లో మార్పులు..!!
- సౌదీ అరేబియాలో 22.1% పెరిగి నాన్ ఆయిల్ ఎగుమతులు..!!
- భారత్ లో 100 కొత్త ఎయిర్పోర్టులు..కేంద్ర క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్
- బాలకృష్ణకు అరుదైన గౌరవం- లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ప్రదానం
- ఇరాన్ ఆయిల్ వార్తలపై రిలయన్స్ క్లారిటీ
- భద్రాద్రి పునర్నిర్మాణ ఆలయ నమూనా









