కోవిడ్ 19 నిబంధనల ఉల్లంఘన: 100,000 రియాల్స్ వరకు జరిమానా
- September 17, 2021
సౌదీ అరేబియా: సౌదీ అథారిటీస్, కోవిడ్ 19 నిబంధనల ఉల్లంఘన పై తీవ్ర హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. కోవిడ్ 19 వ్యాప్తిని అరికట్టేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా వుండాలని అధికారులు పేర్కొన్నారు. నిబంధనల్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఉల్లంఘనకు పాల్పడేవారికి 100,000 రియాల్స్ వరకు జరిమానా విధిస్తారు.ఫేస్ మాస్క్ ధరించడం, సోషల్ డిస్టెన్సింగ్ పాటించడం వంటి వాటి ద్వారా కోవిడ్ 19 వ్యాప్తిని నివారించవచ్చు. ఆయా ఉల్లంఘనలకు 1,000 రియాల్స్ నుంచి జరిమానాలు మొదలవుతాయి. రెండోసారి ఉల్లంఘనలకు పాల్పడితే జరిమానా రెట్టింపు అవుతుంది. అలా అత్యధికంగా 100,000 రియాల్స్ వరకు జరిమానా ఎదుర్కోవాల్సి వస్తుంది ఉల్లంఘనులు. కాగా, దేశంలో ఇప్పటిదాకా 546,251 కోవిడ్ 19 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. 8,460 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు.
తాజా వార్తలు
- NEET పునఃపరీక్షలో మొత్తం 30 మంది అరెస్టు
- ఖతార్లో భారీ పేలుడు: 54 మందికి గాయాలు, 18 మంది గల్లంతు
- హర్మూజ్ జలసంధి మూసివేతతో భారీగా పెరిగిన చమురు ధరలు
- రూ.50 లక్షలకోసం భర్త కిడ్నాప్ డ్రామా!
- యూఏఈలో మూడు రోజులపాటు రెయిన్ అలెర్ట్..!!
- సాయికృష్ణ మిస్సింగ్ కేసు..నేడు కోర్టుకు ఆధారాలు
- గల్ఫ్ కార్మికుల ఓటు హక్కుల పై మంత్రి పొన్నం ప్రభాకర్తో చర్చ
- దుబాయ్లో బ్యాడ్మింటన్ ఆడుతూ భారతీయ ప్రవాసి మృతి..!!
- సల్మానియా మెడికల్ కాంప్లెక్స్లో బొంగో సంస్కృతి బహ్రెయిన్ రక్తదాన శిబిరం..!!
- ఫోర్బ్స్ టాప్ 100లో ఆరు కువైట్ ఫ్యామిలీ ఎంటర్ప్రైజెస్ కు చోటు..!!







