కోవిడ్ 19 నిబంధనల ఉల్లంఘన: 100,000 రియాల్స్ వరకు జరిమానా
- September 17, 2021
సౌదీ అరేబియా: సౌదీ అథారిటీస్, కోవిడ్ 19 నిబంధనల ఉల్లంఘన పై తీవ్ర హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. కోవిడ్ 19 వ్యాప్తిని అరికట్టేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా వుండాలని అధికారులు పేర్కొన్నారు. నిబంధనల్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఉల్లంఘనకు పాల్పడేవారికి 100,000 రియాల్స్ వరకు జరిమానా విధిస్తారు.ఫేస్ మాస్క్ ధరించడం, సోషల్ డిస్టెన్సింగ్ పాటించడం వంటి వాటి ద్వారా కోవిడ్ 19 వ్యాప్తిని నివారించవచ్చు. ఆయా ఉల్లంఘనలకు 1,000 రియాల్స్ నుంచి జరిమానాలు మొదలవుతాయి. రెండోసారి ఉల్లంఘనలకు పాల్పడితే జరిమానా రెట్టింపు అవుతుంది. అలా అత్యధికంగా 100,000 రియాల్స్ వరకు జరిమానా ఎదుర్కోవాల్సి వస్తుంది ఉల్లంఘనులు. కాగా, దేశంలో ఇప్పటిదాకా 546,251 కోవిడ్ 19 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. 8,460 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







