ఏపీ ముఖ్యమంత్రి జగన్‌కు చంద్రబాబు సంచలన లేఖ

- September 17, 2021 , by Maagulf
ఏపీ ముఖ్యమంత్రి జగన్‌కు చంద్రబాబు సంచలన లేఖ

హైదరాబాద్: తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త పాలక మండలిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు చంద్రబాబు. ఇదొక జంబో బోర్డ్ అంటూ విరుచుకుపడ్డారు. భక్తి భావంతో, స్వామి సేవలో తరించే వారికి బోర్డులో ప్రాధాన్యం ఇవ్వాల్సింది పోయి.. సీబీఐ కేసుల్లో నిందితులుగా ఉన్న వ్యక్తులు, అవినీతిపరులు, నేర చరిత్ర కలిగిన వారిని బోర్డులోకి తీసుకున్నారని ఆరోపించారు. వ్యాపార ధోరణిలో టీటీడీ జంబో బోర్డు ఏర్పాటు చేసి.. పవిత్ర క్షేత్రాన్ని వ్యాపార సంస్థగా మార్చడం అత్యంత బాధాకరం అన్నారు.

తిరుమలను రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం సరికాదని మండిపడ్డారు. రాజకీయ నిరుద్యోగులకు ధర్మకర్తల బోర్డును కేంద్రంగా మార్చేశారని, జంబో బోర్డు ఏర్పాటులో స్వార్థ ప్రయోజనాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని విమర్శించారు. తిరుమల ప్రతిష్ఠత, భక్తుల మనోభావాలు దెబ్బతినేలా జగన్‌ ప్రభుత్వ చర్యలు ఉన్నాయంటూ జగన్‌కు లేఖ రాశారు చంద్రబాబు. మరోవైపు సామాన్య భక్తుల నుంచి కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 50 మందిని ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీళ్లంతా ఏడాది పొడవునా దర్శనాలకు వస్తుంటే.. ఇక సామాన్యులు శ్రీవారిని అరక్షణమైనా చూడగలరా అని ప్రశ్నిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com