ఒమన్లో జనాభా తగ్గుదల..పదేళ్లలో తొలిసారి నమోదు
- September 18, 2021
మస్కట్: ఒమన్లో జనాభా తగ్గుదల నమోదవుతోంది. నేషనల్ సెంటర్ ఫర్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ జారీ చేసిన డేటా ప్రకారం2020 లో ఒమన్ జనాభా 3 శాతం తగ్గింది. జనాభా తగ్గుదల నమోదవటం 10 సంవత్సరాలలో మొదటిసారి. సెప్టెంబర్ 12 ఆదివారం నాటికి సుల్తానేట్ జనాభా 44,11,756 అని ఎన్సీఎస్ఐ తెలిపింది. మొత్తం జనాభాలో 63 శాతం మంది ఒమనీయులు కాగా, ప్రవాసులు 37 శాతం ఉన్నారు. ప్రవాసీయుల్లో అత్యధికంగా బంగ్లాదేశ్ జాతీయులు 5,28,682 మంది ఉన్నారు. ఆ తర్వాత భారతీయులు 4,65,037 మంది, పాకిస్తానీయులు 1,79,408 మంది ఉన్నారు. ఇదిలాఉంటే..ఎన్సీఎస్ఐ గణాంకాల మేరకు మార్చి 2020, మార్చి 2021 మధ్య 2,15,000 కంటే ఎక్కువ మంది ప్రవాస కార్మికులు ఒమన్ నుండి వెళ్లిపోయారు.
తాజా వార్తలు
- రియాద్లో హౌజ్ హోల్డ్ డెమోగ్రాఫిక్ సర్వే ప్రారంభం..!!
- యూఏఈలో ఇంధన ధరలు పెరుగుతాయా?
- బ్రోకరేజ్ సంస్థల పై నియంత్రణ విధించాలని ఎంపీల పిలుపు..!!
- ఒమన్ లో రాబోయే మూడు రోజులపాటు వర్షాలు..!!
- ఖతార్ లో మూడు ప్రముఖ ఆహార సంస్థలు మూసివేత..!!
- పెరంబూర్ నుంచి నామినేషన్ వేసిన దళపతి విజయ్
- కువైట్లో నీటి శుద్ధీకరణ కేంద్రం పై దాడి..భారతీయ కార్మికుడు మృతి
- NRI టీడీపీ గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో టీడీపీ 44వ ఘనంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- మహిళను హత్య చేసి ఫ్రిజ్లో భద్రపరిచిన వ్యక్తి లొంగుబాటు
- తెలంగాణలో దంచికొడుతున్న ఎండలు..22 జిల్లాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు









