ఒమ‌న్లో జ‌నాభా త‌గ్గుద‌ల..ప‌దేళ్ల‌లో తొలిసారి న‌మోదు

- September 18, 2021 , by Maagulf
ఒమ‌న్లో జ‌నాభా త‌గ్గుద‌ల..ప‌దేళ్ల‌లో తొలిసారి న‌మోదు

మస్కట్: ఒమ‌న్లో జ‌నాభా త‌గ్గుద‌ల న‌మోద‌వుతోంది. నేషనల్ సెంటర్ ఫర్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్  జారీ చేసిన డేటా ప్రకారం2020 లో ఒమన్ జనాభా 3 శాతం తగ్గింది. జ‌నాభా త‌గ్గుద‌ల న‌మోద‌వ‌టం 10 సంవత్సరాలలో మొదటిసారి. సెప్టెంబర్ 12 ఆదివారం నాటికి సుల్తానేట్ జనాభా 44,11,756  అని ఎన్సీఎస్ఐ తెలిపింది. మొత్తం జనాభాలో 63 శాతం మంది ఒమనీయులు కాగా, ప్రవాసులు 37 శాతం ఉన్నారు. ప్ర‌వాసీయుల్లో అత్య‌ధికంగా బంగ్లాదేశ్ జాతీయులు 5,28,682 మంది ఉన్నారు. ఆ త‌ర్వాత భార‌తీయులు 4,65,037 మంది, పాకిస్తానీయులు 1,79,408 మంది ఉన్నారు. ఇదిలాఉంటే..ఎన్సీఎస్ఐ గణాంకాల మేర‌కు మార్చి 2020,  మార్చి 2021 మధ్య 2,15,000 కంటే ఎక్కువ మంది ప్రవాస కార్మికులు ఒమన్ నుండి వెళ్లిపోయారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com