హత్య కోసం బహ్రెయిన్కి అనుచరుడ్ని పంపిన దావూద్ ఇబ్రహీం
- September 18, 2021
మనామా: ఢిల్లీ పోలీసులు జాన్ మొహమ్మద్ అలియాస్ సమీర్ కలియా మరో ఐదుగుర్ని అరెస్ట్ చేసిన అనంతరం ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ ఓ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించింది. ముంబైకి చెందిన 47 ఏళ్ళ వ్యక్తిని బహ్రెయిన్కి పంపించి ఓ గ్యాంగ్స్టర్ని చంపించేందుకు ప్రయత్నాలు జరిగాయని ఆ రిపోర్ట్ చెబుతోది. దావూద్ ఇబ్రహీం సూచనల మేరకు షేక్ అనే వ్యక్తి, అలి బుదెష్ అనే గ్యాంగ్స్టర్ని చంపేందుకు బహ్రెయిన్ వెళ్ళాడు. షేక్ అలియాస్ సమీర్ కలియా, రాజస్తాన్లో అరెస్టయ్యాడు. కొద్ది రోజుల క్రితం షేక్, బహ్రెయిన్ వెళ్ళినట్లుగా గుర్తించారు. అయితే బుదేష్ని మాత్రం చంపలేకపోయాడు. బుదేష్ మరియు దావూద్ గ్యాంగ్ మధ్య ఒకప్పుడు మంచి సంబంధాలుండేవి. అయితే, ఆ తర్వాత రెండు గ్యాంగుల మధ్య విభేదాలు తలెత్తాయి.
తాజా వార్తలు
- సమాజ సేవలో 'అర్జాస్ స్టీల్' ముందంజ
- IPL 2026: CSK పై RR విజయం
- యాపిల్స్ తో మోసం..హైదరాబాద్ వ్యాపారికి రూ.5.7 కోట్లు టోపీ !!
- సౌదీ క్రౌన్ ప్రిన్స్ తో ముగిసిన ఖతార్ ఎమిర్ భేటీ
- దుబాయ్ వ్యాపార రంగానికి AED 1 బిలియన్ సపోర్ట్ ప్యాకేజ్
- ఏనుగుకు గులాబీ రంగు..ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు
- ఏప్రిల్ లో బ్యాంకులకు 14 రోజులు సెలవులు..
- తెలంగాణ: అసెంబ్లీలో హేట్ స్పీచ్ బిల్లు ప్రవేశపెట్టిన ప్రభుత్వం
- నేవీ చీఫ్ మృతిని కన్ఫర్మ్ చేసిన ఇరాన్
- నాయుడుపేటలో టిడ్కో ఇళ్లను పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు









