హత్య కోసం బహ్రెయిన్‌కి అనుచరుడ్ని పంపిన దావూద్ ఇబ్రహీం

- September 18, 2021 , by Maagulf
హత్య కోసం బహ్రెయిన్‌కి అనుచరుడ్ని పంపిన దావూద్ ఇబ్రహీం

మనామా: ఢిల్లీ పోలీసులు జాన్ మొహమ్మద్ అలియాస్ సమీర్ కలియా మరో ఐదుగుర్ని అరెస్ట్ చేసిన అనంతరం ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ ఓ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించింది. ముంబైకి చెందిన 47 ఏళ్ళ వ్యక్తిని బహ్రెయిన్‌కి పంపించి ఓ గ్యాంగ్‌స్టర్‌ని చంపించేందుకు ప్రయత్నాలు జరిగాయని ఆ రిపోర్ట్ చెబుతోది. దావూద్ ఇబ్రహీం సూచనల మేరకు షేక్ అనే వ్యక్తి, అలి బుదెష్ అనే గ్యాంగ్‌స్టర్‌ని చంపేందుకు బహ్రెయిన్ వెళ్ళాడు. షేక్ అలియాస్ సమీర్ కలియా, రాజస్తాన్‌లో అరెస్టయ్యాడు. కొద్ది రోజుల క్రితం షేక్, బహ్రెయిన్ వెళ్ళినట్లుగా గుర్తించారు. అయితే బుదేష్‌ని మాత్రం చంపలేకపోయాడు. బుదేష్ మరియు దావూద్ గ్యాంగ్ మధ్య ఒకప్పుడు మంచి సంబంధాలుండేవి. అయితే, ఆ తర్వాత రెండు గ్యాంగుల మధ్య విభేదాలు తలెత్తాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com