ఏపీలో కరోనా కేసుల వివరాలు
- September 20, 2021అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గింది… ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 42,679 శాంపిల్స్ పరీక్షించగా.. 839 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది.. ఇక, గుంటూరు, కృష్ణా జిల్లాలో ఇద్దరు చొప్పున, చిత్తూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున.. మొత్తం 8 మంది కోవిడ్ బాధితులు కన్నుమూశారు. ఇదే సమయంలో 1,142 మంది పూర్థిస్థాయిలో కోలుకున్నారని బులెటిన్లో పేర్కొంది ప్రభుత్వం.
తాజా టెస్ట్లతో కలుపుకుని.. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు నిర్వహించిన టెస్ట్ల సంఖ్య 2,77,63,761కు చేరింది. ఇక, మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,39,529కి పెరగగా.. ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 20,11,063కు చేరుకుంది.. మరోవైపు.. ఇప్పటి వరకు 14,078 మంది కోవిడ్ బాధితులు రాష్ట్రంలో మృతిచెందగా.. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 14,388గా ఉన్నాయని పేర్కొంది ఏపీ ప్రభుత్వం.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ