ఇండియాతో వ్యూహాత్మ‌క మైత్రి బంధ‌మే ల‌క్ష్యంగా సౌదీ అడుగులు

- September 21, 2021 , by Maagulf
ఇండియాతో వ్యూహాత్మ‌క మైత్రి బంధ‌మే ల‌క్ష్యంగా సౌదీ అడుగులు

న్యూ ఢిల్లీ: భార‌త్ తో వ్యూహాత్మ‌క మైత్రి బంధాన్ని బ‌రింత బ‌లోపేతం చేసుకోవ‌టం..విజ‌న్ 2030 ల‌క్ష్యానికి అనుగుణంగా ప‌ర‌స్ప‌ర పెట్టుబ‌డులు..ఇత‌ర రంగాల్లో స‌హాక‌రం అందింపుచ్చుకోవ‌టం ల‌క్ష్యంగా సౌదీ విదేశాంగ మంత్రి భార‌త ప‌ర్య‌ట‌న కొన‌సాగింది. రెండు రోజుల ప‌ర్య‌ట‌న కోసం భార‌త్ వ‌చ్చిన విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైస‌ల్ బిన్ ఫ‌ర్హాన్ త‌న ప‌ర్య‌ట‌న‌కు ముందు ప్ర‌ధాని న‌రేంద్ర మోదీతో స‌మావేశం అయ్యారు. రెండు దేశాలు ప‌ర‌స్ప‌ర స‌హాకారంతో ప్ర‌స్తుత మ‌హ‌మ్మారి సంక్షోభ ప‌రిస్థితుల‌ను అధిగ‌మించాల‌ని ఆశిస్తున్న‌ట్లు ఆయ‌న మోదీతో అన్నారు. ఆర్ధిక‌, ప‌ర‌స్ప‌ర వాణిజ్యం, పెట్టుబ‌డులు ఇరు దేశాల మైత్రికి ఓ పిల్ల‌ర్ అని అభిప్రాయ‌ప‌డ్డారు. భార‌త్ లో గత ఐదేళ్ల‌లోనే సౌదీ పెట్టుబ‌డులు 6 రెట్లు పెరిగాయ‌ని..2014లో 60 మిలియ‌న్ డాలర్ల పెట్టుబ‌డులు పెడితే..ప్ర‌స్తుతం 350 మిలియ‌న్ డాల‌ర్ల మేర పెట్టుబ‌డులు పెట్టిన‌ట్లు సౌదీ విదేశాంగ మంత్రి వివ‌రించారు. అదే స‌మ‌యంలో సౌదీ 2030 విజ‌న్ కు అనుగుణంగా భార‌త్ వైపు నుంచి కూడా పెట్టుబ‌డుల‌ను ఆశిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. ఇది రెండు దేశాలకు ప్ర‌యోజ‌న‌క‌రంగా ఉండాల‌ని అభిలాశించారు. ఇదిలాఉంటే భార‌త్ తో సౌదీ స్నేహ‌బంధం ద‌క్షిణాసియాలోనే వ్యూహాత్మ‌క మైత్రి అని నిపుణులు చెబుతున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com