ఐసిస్ ఆగడాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి
- March 16, 2016
ఐసిస్ ఆగడాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. చిన్నాపెద్దా తేడా లేకుండా క్రూర జంతువుల్లా ప్రవరిస్తూ ప్రాణాలు తీసేస్తున్నారు. తాజాగా సిరియాకు చెందిన ఓ యువకుడు ఎక్కువగా మాట్లాడుతున్నాడని అతని నోరు కుట్టేసి వూరేగించారు. సిరియాలోని డెయిర్ ఎజ్జోర్ నగరంలో చోటు చేసుకుంది ఈ ఘటన. సిరియాకి చెందిన ఓ యువకుడు కుర్దిష్ ఉగ్రవాదులు ఈ నగరానికి వస్తున్నారని డెయిర్ ఎజ్జోర్లోని ఓ రెస్టారెంట్ యాజమాన్యానికి సమాచారం అందించాడు. ఇది తెలుసుకున్న ఐసిస్ జిహాదీలు అతన్ని అదుపులోకి తీసుకుని నోటిని కుట్టి.. ఆ తర్వాత బంధించి నగరంలో వూరేగించారు.ఐసిస్ ఇలాంటి ఘటనలకు పాల్పడటం ఇది మొదటిసారి కాదు. ఐఎస్ ఉగ్రవాదులను తరిమికొట్టేందుకు డెయిర్ ఎజ్జోర్ నగరానికి 70 కి.మీలు దూరంలో ఉన్న అబు కషబ్ గ్రామాల్లో కుర్దిష్, యాజిది బలగాలు ఇప్పటివరకు ఇలాంటి ఎన్నో ఘటనలకు తెగబడ్డాయి.
తాజా వార్తలు
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం
- ఇరాన్ దాడితో కువైట్ విద్యుత్, నీటి డిస్టిలేషన్ ప్లాంట్కు నష్టం
- తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటల నిరీక్షణ
- అమ్మ, నాన్నల ప్రోత్సాహంతో నీట్ లో 423 ర్యాంక్
- 230 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. 50 వేల దిర్హామ్ జరిమానా..!!
- సౌదీ అరేబియాలో ఇద్దరు యెమెన్ ప్రవాసులు అరెస్ట్..!!







