కమలాహారిస్ను భారత్ కు ఆహ్వానించిన ప్రధాని మోదీ
- September 24, 2021
అమెరికా: ప్రధాని మోదీ శుక్రవారం అమెరికా వెస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ ను కలిశారు. ఈ సందర్భంగా ఇండియా - అమెరికా నేచురల్ పార్టనర్స్ అని కొనియాడారు మోదీ. మ్యూచువల్, గ్లోబల్ ఇంటరస్ట్ అంశాలపై జరిగిన చర్చల్లో ఇద్దరు లీడర్లు పాల్గొన్నారు.
'ఇండియా, అమెరికాలు నేచురల్ పార్టనర్స్. మాకు సామీప్య విలువలు, భౌగోళిక రాజకీయ ఆసక్తులు ఉన్నాయి' అని పీఎం మోదీ.. హారిస్ తో పాటు పాల్గొన్న సమావేశంలో వెల్లడించారు. ఇండియా, అమెరికాలు అతిపెద్ద, పురాతన ప్రజాస్వామ్య వ్యవస్థ కలిగి ఉన్నాయి. ఇరు దేశాల విలువలు, సహకారం క్రమంగా పెరుగుతూనే ఉంది.ఇండియాలో కొవిడ్ సంక్షోభం గురించి జూన్ నెలలో పీఎం మోదీతో మాట్లాడిన కమలాహారిస్.. నేరుగా మోదీని కలవడం ఇదే తొలిసారి.
'మన ద్వైపాక్షిక సంబంధాలు ప్రెసిడెంట్ జో బైడెన్ సమక్షంలో మరో స్థాయికి చేరతాయని వైస్ ప్రెసిడెంట్ కమలాహారిస్ అన్నారు. అంతేకాకుండా ప్రపంచంలో చాలా మందికి ఇది ఇన్స్పిరేషన్గా ఉంటుందని ఆమె కొనియాడారు. ఈ సందర్భంగా కమలాహారిస్ ను ఇండియాకు ఆహ్వానించారు మోదీ.
4 రోజుల పర్యటన నేపథ్యంలో అమెరికాలో బిజీ బిజీగా గడుపుతున్నారు ప్రధాని మోదీ. క్వాల్కామ్, అడోబ్, ఫస్ట్ సోలార్, జనరల్ అటమిక్స్, బ్లాక్స్టోన్ కంపెనీలకు సంబంధించిన ఐదుగురు సీఈవోలతో చర్చలు నిర్వహించారు. ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్, జపాన్ ప్రధాని యోషిహిదే సుగాతో భేటీ అయ్యారు. ద్వైపాక్షిక, అంతర్జాతీయ అంశాలపై చర్చించారు. ఇండో- పసిఫిక్ ప్రాంతంలో భవిష్యత్ కార్యచరణపై చర్చించారు.
తాజా వార్తలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..







