బ్లడ్ క్యాన్సర్ చికిత్సలో కార్ టి టెల్ థెరపీ సామర్థ్యాన్ని పరీక్షించనున్న యూఏఈ
- September 25, 2021
అబుధాబి: అబుధాబిలోని ఓ రీసెర్చి ఇనిస్టిట్యూట్, బ్లడ్ క్యాన్సర్ చికిత్సలో ఇమ్యూనోథెరపీ వల్ల కలిగే ప్రయోజనాల గురించి ప్రయోగ పరీక్షలు నిర్వహిస్తోంది. ఈ ప్రాంతంలో ఇదే తొలి ప్రయోగం. అబుధాబి స్టెమ్ సెల్స్ సెంటర్ ఈ విషయాన్ని వెల్లడించింది. చిమెటిక్ యాంటిజెన్ రిసెప్టర్ టి సెల్ థెరపీ అనేది ప్రపంచ వ్యాప్తంగా గుర్తించబడిన ఇమ్యునోథెరపీ. కార్ టి సెల్ థెరపీ, శరీర డిఫెన్స్ సిస్టమ్ని ప్రేరేపిస్తుంది. టి సెల్స్ని రీ ప్రోగ్రామింగ్ చేస్తుంది. యాంటీ ట్యూమర్ రెస్పాన్స్ విషయంలో శరీరానికి సహకరించే అతి కీలక అంశమిది. క్యాన్సర్ కణాల్ని చంపడానికి ఉపకరిస్తుంది ఈ విధానం. రీ ప్రోగ్రామ్ చేయబడిన సెల్స్ సజీవంగా వున్న మందులా మారి, క్యాన్సర్ మీద పోరాడుతుంది.
తాజా వార్తలు
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం
- ఇరాన్ నుండి నష్టపరిహారం ఇప్పించండి: బహ్రెయిన్
- 10% వరకు పెరగనున్న విమాన ఛార్జీలు..!!
- కువైట్ లో రెండు రోజులపాటు భారీ వర్షాలు..!!
- సౌదీలో చట్టాలను ఉల్లంఘించిన 14,487 మంది అరెస్టు..!!









