కురుస్తున్న భారీ వర్షాలకు ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా అధికారులు అప్రమత్తం: GHMC మేయర్
- September 27, 2021
హైదరాబాద్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వలన కురుస్తున్న భారీ వర్షాలకు ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా అధికారులు అప్రమత్తంగా ఉన్నారని నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి వివరించారు. సోమవారం జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయం కంట్రోల్ రూంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ....వాతావరణ శాఖ సూచన మేరకు వర్ష ప్రభావిత ప్రాంతాల్లో ని లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఎస్.ఎఫ్.ఏ, జవాను నుండి జోనల్ కమిషనర్ స్థాయి అధికారులు 24 గంటల పాటు పని చేస్తారన్నారు. అందు కోసం 170 మాన్సూన్ టీమ్ బృందాలు, 92 స్టాటిస్టిక్స్ బృందాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అత్యవసరం తప్పు ఎవ్వరూ బయటకు రావద్దన్నారు. 30 పునరావాస కేంద్రాలను ఏర్పాటు అవసరమైతే మరిన్ని కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో 040- 21111111 నంబర్ హెల్ప్ లైన్ 24 గంటల పాటు 3 షిఫ్ట్ లో పని చేసే సిబ్బంది నీ ఏర్పాటు చేశారు. ప్రజలు ఇబ్బందులు ఎదురైనా పక్షంలో హెల్ప్ లైన్ ను సంప్రదిస్తే వెంటనే సహాయక చర్యలు అధికారులు తీసుకుంటారని తెలిపారు. లోతట్టు ప్రాంతాల్లో నీటిని తొలగించేందుకు 202 మోటర్లను ఏర్పాటు చేసినట్లు వివరించారు. డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి మాట్లాడుతూ గత సంవత్సరం అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని జిహెచ్ఎంసి ద్వారా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- టీఆర్ఎస్ చీఫ్ కవితతో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ భేటీ
- అబూధాబి BAPS హిందూ మందిరానికి ప్రతిష్ఠాత్మక ‘టాలరెన్స్ అవార్డు 2026’
- తెలంగాణ రోడ్లకు రూ.7,597 కోట్లు విడుదల చేసిన కేంద్రం
- కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన డీకే శివకుమార్
- ప్రజల విశ్వాసమే పోలీసింగ్కు పునాది: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్
- ఇరాన్ దాడి అనంతరం కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సందర్శించిన ప్రధాని షేక్ అహ్మద్
- క్షిపణుల అడ్డుకట్ట దృశ్యాలు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్ట్
- క్షతగాత్రులను పరామర్శించిన కువైట్ రక్షణ మంత్రి షేఖ్ అబ్దుల్లా అలీ
- హిజ్రీ నూతన సంవత్సరానికి యూఏఈలో జూన్ 15న సెలవు









