కురుస్తున్న భారీ వర్షాలకు ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా అధికారులు అప్రమత్తం: GHMC మేయర్
- September 27, 2021
హైదరాబాద్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వలన కురుస్తున్న భారీ వర్షాలకు ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా అధికారులు అప్రమత్తంగా ఉన్నారని నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి వివరించారు. సోమవారం జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయం కంట్రోల్ రూంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ....వాతావరణ శాఖ సూచన మేరకు వర్ష ప్రభావిత ప్రాంతాల్లో ని లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఎస్.ఎఫ్.ఏ, జవాను నుండి జోనల్ కమిషనర్ స్థాయి అధికారులు 24 గంటల పాటు పని చేస్తారన్నారు. అందు కోసం 170 మాన్సూన్ టీమ్ బృందాలు, 92 స్టాటిస్టిక్స్ బృందాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అత్యవసరం తప్పు ఎవ్వరూ బయటకు రావద్దన్నారు. 30 పునరావాస కేంద్రాలను ఏర్పాటు అవసరమైతే మరిన్ని కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో 040- 21111111 నంబర్ హెల్ప్ లైన్ 24 గంటల పాటు 3 షిఫ్ట్ లో పని చేసే సిబ్బంది నీ ఏర్పాటు చేశారు. ప్రజలు ఇబ్బందులు ఎదురైనా పక్షంలో హెల్ప్ లైన్ ను సంప్రదిస్తే వెంటనే సహాయక చర్యలు అధికారులు తీసుకుంటారని తెలిపారు. లోతట్టు ప్రాంతాల్లో నీటిని తొలగించేందుకు 202 మోటర్లను ఏర్పాటు చేసినట్లు వివరించారు. డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి మాట్లాడుతూ గత సంవత్సరం అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని జిహెచ్ఎంసి ద్వారా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
తాజా వార్తలు
- శాంతియుత అణుశక్తి వినియోగం పై అమెరికా–సౌదీ మధ్య కీలక ఒప్పందం
- WTC ఫైనల్-2027 వేదిక, తేదీలు ఖరారు
- యూఏఈలో భారతీయ పాస్పోర్ట్ దరఖాస్తుదారులకు కొత్త హెచ్చరిక..
- ఇన్ఫోసిస్ కొత్త సీఈవోగా ఆశిష్ కుమార్ దాష్
- సిక్కిం ఘటనపై భారత్కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్లో భారత పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్లో భారత రాయబారి విపుల్కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా







