ఎక్స్‌పో 2020 దుబాయ్: ప్రభుత్వ ఉద్యోగులకు ఆరు రోజుల సెలవు ప్రకటన

- September 28, 2021 , by Maagulf
ఎక్స్‌పో 2020 దుబాయ్: ప్రభుత్వ ఉద్యోగులకు ఆరు రోజుల సెలవు ప్రకటన

దుబాయ్: దుబాయ్ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. ఎక్స్‌పో దుబాయ్ సందర్శించేందుకు వీలుగా ఆరు రోజులు సెలవుని ఉద్యోగులకు ప్రకటించారు. దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమదాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. అక్టోబర్ 1 నుంచి ఎక్స్‌పో ప్రారంభం కానుంది. మార్చి 31 వరకూ కొనసాగుతుంది. ఉద్యోగులు ఎక్స్‌పోలను 192 పెవిలియన్ల వద్ద విశేషాల్ని తెలుసుకుని తమని తాము మరింత ఉన్నతంగా తీర్చి దిద్దుకునేందుకు ఇది ఉపయోగపడనుంది. వచ్చే 50 ఏళ్లకు సంబంధించి నిర్దేశించుకున్న అత్యద్భుతమైన లక్ష్యాల్ని అందుకునే క్రమంలో ఉద్యోగుల పాత్ర అత్యంత కీలకంగా ఉండబోతుందని క్రౌన్ ప్రిన్స్ అభిప్రాయపడ్డారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com