ఎక్స్పో 2020 దుబాయ్: ప్రభుత్వ ఉద్యోగులకు ఆరు రోజుల సెలవు ప్రకటన
- September 28, 2021
దుబాయ్: దుబాయ్ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. ఎక్స్పో దుబాయ్ సందర్శించేందుకు వీలుగా ఆరు రోజులు సెలవుని ఉద్యోగులకు ప్రకటించారు. దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమదాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. అక్టోబర్ 1 నుంచి ఎక్స్పో ప్రారంభం కానుంది. మార్చి 31 వరకూ కొనసాగుతుంది. ఉద్యోగులు ఎక్స్పోలను 192 పెవిలియన్ల వద్ద విశేషాల్ని తెలుసుకుని తమని తాము మరింత ఉన్నతంగా తీర్చి దిద్దుకునేందుకు ఇది ఉపయోగపడనుంది. వచ్చే 50 ఏళ్లకు సంబంధించి నిర్దేశించుకున్న అత్యద్భుతమైన లక్ష్యాల్ని అందుకునే క్రమంలో ఉద్యోగుల పాత్ర అత్యంత కీలకంగా ఉండబోతుందని క్రౌన్ ప్రిన్స్ అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- నెదర్లాండ్స్ పై భారత్ విజయం
- హైదరాబాద్లో హాట్ కేకుల్లా అమ్ముడైన హౌసింగ్ బోర్డు ప్లాట్లు
- ఏపీ: ఫిబ్రవరి 24న మంత్రివర్గ సమావేశం
- ఏప్రిల్ లో ముంబైలో ఘనంగా తొలి INCA అవార్డులు వేడుక
- సోషల్ మీడియాలో ‘ఓవర్ షేరింగ్’ చేస్తే డేంజర్ లో పడినట్లే!!
- రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల..
- తెలంగాణ వైద్యారోగ్య శాఖలో సరికొత్త స్కామ్!
- ప్రధాని నరేంద్ర మోదీతో సుందర్ పిచాయ్ భేటీ
- కువైట్ అంతటా మస్జీదుల్లో సందడి..!!
- అనుచిత సోషల్ మీడియా పోస్ట్ లపై స్కూల్స్ వార్న్..!!









