పాకిస్తాన్‌లో మహిళా స్కూల్ ప్రిన్సిపల్‌కి మరణ శిక్ష

- September 30, 2021 , by Maagulf
పాకిస్తాన్‌లో మహిళా స్కూల్ ప్రిన్సిపల్‌కి మరణ శిక్ష

ఇస్లామాబాద్: లాహోర్ సెషన్స్ కోర్టు పాకిస్థాన్ ఫీనల్ కోడ్ 295 సి సెక్షన్ కింద ఓ మహిళకు మరణ శిక్ష ఖరారు చేసింది. 50,000 పాకిస్థానీ రూపాయల జరిమానా కూడా విధించింది. కేసు వివరాల్లోకి వెళితే, సల్మా తన్వీర్ అనే మహిళ హోలీ ప్రొఫెట్ మొహమ్మద్‌ని కించపరిచేలా కొన్ని రాతలతో కూడిన పత్రాలను తయారు చేసి ఇతరులకు పంచడం జరిగింది. ఇది పాకిస్థానీ చట్టాల ఉల్లంఘన కిందకి వస్తుంది. సదరు మహిళ ఓ ప్రయివేటు స్కూల్ ప్రిన్సిపాల్. తనకు తానే దైవాంశ సంభూతురాలిగా ఆమె అభివర్ణించుకుంది. విచారణ సందర్భంగా ఆమె మానసిక స్థితి సరిగానే ఉందని తేలింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com