పేరెంట్స్ కు ఊరట. నాన్ రిఫండబుల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఫీజు మాఫీ చేసిన ఇండియన్ స్కూల్స్
- October 01, 2021
మస్కట్: ఇండియన్ స్కూల్స్ పేరెంట్స్ కు ఊరట కలిగించే నిర్ణయం తీసుకున్నాయి. కరోనా కారణంగా చాలా మంది స్టూడెంట్స్ పేరెంట్స్ ఇబ్బందులు పడ్డారు. ఉద్యోగాలు లేక పనులు పోయి ఆర్థిక సమస్యలు ఎదుర్కొన్నారు. దాదాపు ఏడాదిన్నరగా స్కూల్స్ మూసే ఉన్నాయి. ఈ వారంలో స్కూల్స్ ఓపెన్ చేస్తున్నారు. ఐతే పేరెంట్స్ రిక్వెస్ట్ మేరకు ఇండియన్ స్కూల్స్ నాన్ రిఫండబుల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఫీజు మాఫీ చేయాలని నిర్ణయించాయి. “కరోనా కారణంగా ఆర్థిక ఇబ్బందులు పడుతున్న స్టూడెంట్స్ తల్లితండ్రుల విజ్ఞప్తి మేరకు నాన్ రిఫండబుల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఫీజు మాఫీ చేయాలని నిర్ణయించాం” అని ఒమన్ లోని ఇండియన్ స్కూల్స్ చైర్మన్ డాక్టర్ శివకుమార్ మాణికం చెప్పారు. అదే విధంగా క్వార్టర్లీ చెల్లించాల్సిన ఫీజును నెల నెల చెల్లించే అవకాశం కూడా కల్పించింది. ఇండియన్ స్కూల్స్ నిర్ణయంపై పేరెంట్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..









