సౌదీలో మరిన్ని కొత్త పబ్లిక్ ప్రాసిక్యూషన్స్ ను ఏర్పాటు చేస్తామన్న సౌదీ అటార్నీ జనరల్
- October 01, 2021
సౌదీ: దేశంలో జరుగుతున్న నేరాలకు సంబంధించిన విచారణ వేగవంతం చేయాలని సౌదీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా కొత్తగా మరిన్ని పబ్లిక్ ప్రాసిక్యూషన్స్ ను త్వరలోనే ప్రారంభిస్తామని అటార్నీ జనరల్ షేక్ సౌద్ అల్ ముజాబ్ చెప్పారు. గురువారం యెన్బు లోని కింగ్ డమ్ ప్రాసిక్యూషన్ ఆఫీస్ లో జరిగిన సమావేశంలో అటార్నీ జనరల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మరిన్ని కొత్త పబ్లిక్ ప్రాసిక్యూషన్స్ ను ఏర్పాటు చేస్తామన్నారు. మానవ అక్రమ రవాణా, సైబర్ క్రైమ్స్, పబ్లిక్ ఎథిక్స్, పర్యావరణ అంశాలకు సంబంధించిన సమస్యలను ఈ కొత్త ప్రాసిక్యూషన్ లో ప్రజలు అప్పీల్ చేసుకోవచ్చు. పబ్లిక్ ప్రాసిక్యూషన్ విధానాన్ని ప్రజలకు మరింత చేరువ చేసుందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని అటార్నీ జనరల్ తెలిపారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







