సౌదీలో మరిన్ని కొత్త పబ్లిక్ ప్రాసిక్యూషన్స్ ను ఏర్పాటు చేస్తామన్న సౌదీ అటార్నీ జనరల్

- October 01, 2021 , by Maagulf
సౌదీలో మరిన్ని కొత్త పబ్లిక్ ప్రాసిక్యూషన్స్ ను ఏర్పాటు చేస్తామన్న సౌదీ అటార్నీ జనరల్

సౌదీ: దేశంలో జరుగుతున్న నేరాలకు సంబంధించిన విచారణ వేగవంతం చేయాలని సౌదీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా కొత్తగా మరిన్ని పబ్లిక్ ప్రాసిక్యూషన్స్ ను త్వరలోనే ప్రారంభిస్తామని అటార్నీ జనరల్ షేక్ సౌద్ అల్ ముజాబ్ చెప్పారు. గురువారం యెన్బు లోని  కింగ్ డమ్ ప్రాసిక్యూషన్ ఆఫీస్ లో జరిగిన సమావేశంలో అటార్నీ జనరల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మరిన్ని కొత్త పబ్లిక్ ప్రాసిక్యూషన్స్ ను ఏర్పాటు చేస్తామన్నారు. మానవ అక్రమ రవాణా, సైబర్ క్రైమ్స్, పబ్లిక్ ఎథిక్స్, పర్యావరణ అంశాలకు సంబంధించిన సమస్యలను ఈ కొత్త ప్రాసిక్యూషన్ లో ప్రజలు అప్పీల్ చేసుకోవచ్చు. పబ్లిక్ ప్రాసిక్యూషన్ విధానాన్ని ప్రజలకు మరింత చేరువ చేసుందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని అటార్నీ జనరల్ తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com