పేరెంట్స్ కు ఊరట. నాన్ రిఫండబుల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఫీజు మాఫీ చేసిన ఇండియన్ స్కూల్స్
- October 01, 2021
మస్కట్: ఇండియన్ స్కూల్స్ పేరెంట్స్ కు ఊరట కలిగించే నిర్ణయం తీసుకున్నాయి. కరోనా కారణంగా చాలా మంది స్టూడెంట్స్ పేరెంట్స్ ఇబ్బందులు పడ్డారు. ఉద్యోగాలు లేక పనులు పోయి ఆర్థిక సమస్యలు ఎదుర్కొన్నారు. దాదాపు ఏడాదిన్నరగా స్కూల్స్ మూసే ఉన్నాయి. ఈ వారంలో స్కూల్స్ ఓపెన్ చేస్తున్నారు. ఐతే పేరెంట్స్ రిక్వెస్ట్ మేరకు ఇండియన్ స్కూల్స్ నాన్ రిఫండబుల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఫీజు మాఫీ చేయాలని నిర్ణయించాయి. “కరోనా కారణంగా ఆర్థిక ఇబ్బందులు పడుతున్న స్టూడెంట్స్ తల్లితండ్రుల విజ్ఞప్తి మేరకు నాన్ రిఫండబుల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఫీజు మాఫీ చేయాలని నిర్ణయించాం” అని ఒమన్ లోని ఇండియన్ స్కూల్స్ చైర్మన్ డాక్టర్ శివకుమార్ మాణికం చెప్పారు. అదే విధంగా క్వార్టర్లీ చెల్లించాల్సిన ఫీజును నెల నెల చెల్లించే అవకాశం కూడా కల్పించింది. ఇండియన్ స్కూల్స్ నిర్ణయంపై పేరెంట్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ







