లులు గ్రూప్ చైర్మన్ ఎం.ఎ యూసుఫ్ అలీకి ఒమన్ లాంగ్ టర్మ్ రెసిడెన్స్ వీసా
- October 01, 2021
ఒమాన్: లులు గ్రూప్ చైర్మన్, అబుదాబీ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వైస్ చైర్మన్ ఎం.ఎ యూసుఫ్ అలీకి ఒమన్ ప్రభుత్వం లాంగ్ టర్మ్ రెసిడెన్సీ వీసా ఇచ్చింది. ఒమన్ వాణిజ్య శాఖ మంత్రి ఖ్వాస్ బిన్ మహ్మద్ అల్ యూసుఫ్ ఆయనకు ఈ వీసాను అందజేశారు. ఒమన్ లో వ్యాపారం చేస్తూ ఉద్యోగాలు కల్పించే వారికి ప్రాధాన్యం ఇస్తామని ఒమన్ వాణిజ్య శాఖ సలహాదారు ఖలీద్ బిన్ సయ్యద్ తెలిపారు. లులు గ్రూప్ చైర్మన్ కు లాంగ్ టర్మ్ రెసిడెన్సీ వీసా ఇవ్వటం ద్వారా దేశంలోకి విదేశీ పెట్టుబడులు పెరుగుతాయన్నారు. అటు తనకు ఈ గౌరవం దక్కటం సంతోషంగా ఉందని..ఒమన్ రాజు సుల్తాన్ హయిథమ్ బిన్ తారిక్ అల్ కు యూసుఫ్ అలీ థ్యాంక్స్ చెప్పారు. లులు గ్రూప్ కు పలు దేశాల్లో వందల సూపర్ మార్కెట్ల వ్యాపారం ఉంది. ఒమన్ లోనూ 27 స్టోర్స్ ఉన్నాయి.
తాజా వార్తలు
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం









