లులు గ్రూప్ చైర్మన్ ఎం.ఎ యూసుఫ్ అలీకి ఒమన్ లాంగ్ టర్మ్ రెసిడెన్స్ వీసా
- October 01, 2021
ఒమాన్: లులు గ్రూప్ చైర్మన్, అబుదాబీ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వైస్ చైర్మన్ ఎం.ఎ యూసుఫ్ అలీకి ఒమన్ ప్రభుత్వం లాంగ్ టర్మ్ రెసిడెన్సీ వీసా ఇచ్చింది. ఒమన్ వాణిజ్య శాఖ మంత్రి ఖ్వాస్ బిన్ మహ్మద్ అల్ యూసుఫ్ ఆయనకు ఈ వీసాను అందజేశారు. ఒమన్ లో వ్యాపారం చేస్తూ ఉద్యోగాలు కల్పించే వారికి ప్రాధాన్యం ఇస్తామని ఒమన్ వాణిజ్య శాఖ సలహాదారు ఖలీద్ బిన్ సయ్యద్ తెలిపారు. లులు గ్రూప్ చైర్మన్ కు లాంగ్ టర్మ్ రెసిడెన్సీ వీసా ఇవ్వటం ద్వారా దేశంలోకి విదేశీ పెట్టుబడులు పెరుగుతాయన్నారు. అటు తనకు ఈ గౌరవం దక్కటం సంతోషంగా ఉందని..ఒమన్ రాజు సుల్తాన్ హయిథమ్ బిన్ తారిక్ అల్ కు యూసుఫ్ అలీ థ్యాంక్స్ చెప్పారు. లులు గ్రూప్ కు పలు దేశాల్లో వందల సూపర్ మార్కెట్ల వ్యాపారం ఉంది. ఒమన్ లోనూ 27 స్టోర్స్ ఉన్నాయి.
తాజా వార్తలు
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్చుక్ సంచలన పోస్ట్!
- హౌతీ సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు..!!
- కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా







