కొత్త ట్రావెల్ పాలసీకి అనుగుణంగా హోటల్స్ ప్యాకేజీలు
- October 05, 2021
ఖతార్: ఖతార్ ప్రభుత్వం కొత్త ట్రావెల్ పాలసీని ప్రకటించిన విషయం తెలిసిందే. రేపటి నుంచి ఇది అందుబాటులోకి రానుంది. ఈ పాలసీ ప్రకారం రెడ్ లిస్ట్ లో ఉన్న కంట్రీస్ నుంచి వచ్చే వాళ్లు కచ్చితంగా వ్యాక్సిన్ తీసుకొని ఉండాలి. వీరికి రెండు రోజుల హోటల్ క్వారంటైన్ ఉంటుంది. గ్రీన్ లిస్ట్ లో ఉన్న కంట్రీస్ నుంచి వచ్చే వాళ్లకు వ్యాక్సిన్ తీసుకోకపోయిన అనుమతి ఉంది. కానీ 7 డేస్ హోటల్ క్వారంటైన్ లో ఉండాలి. ఐతే అందుకు అనుగుణంగా హోటల్స్ ప్యాకేజీలను ప్రకటించాయి. వీటిని ఖతార్ వచ్చే ప్రయాణికులు బుక్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. డిస్కవర్ ఖతార్ వెబ్ సైట్ ద్వారా ప్రయాణికులు హోటల్స్ ను బుక్ చేసుకోవచ్చు. రెండు రోజుల క్వారంటైన్ కు, ఏడు రోజుల క్వారంటైన్ కు ఆఫర్స్ తో చాలా హోటల్స్ ప్యాకేజీలు ప్రకటించాయి. వీటిని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు. బుధవారం నుంచి ఈ ఆఫర్స్ అందుబాటులోకి రానున్నాయి. రెడ్ లిస్ట్ లో ఉన్న కంట్రీస్ నుంచి వచ్చే 11 ఏళ్ల లోపు పిల్లలు వ్యాక్సిన్ తీసుకోకపోయిన సరే వాళ్లకు అనుమతి ఇచ్చారు. ఐతే రెండు రోజులు క్వారంటైన్ లో ఉండాల్సిందే.
తాజా వార్తలు
- ఎంపీ సంతోష్ రావు పై కవిత సంచలన వ్యాఖ్యలు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన లోక్ సభాపక్షనేత బాలశౌరి
- ఏపీ: ఎట్టకేలకు కొత్త బైపాస్ ప్రారంభం..త్వరలోనే మరొకటి!
- ఖతార్తో సంబంధాలు మరింత బలోపేతం: అజయ్ బంగా
- ఇండియా-సౌదీ అరేబియా భాగస్వామ్యం బలోపేతం..!!
- భారత రూపాయి పతనానికి బ్రేక్ పడుతుందా?
- షద్దాదియాలో ప్రవాస కార్మికుల హౌజింగ్ కు స్థలాలు..!!
- ఒమన్లో కార్మికులకు అండగా కొత్త నిబంధనలు..!!
- మద్యం సేవించి డ్రైవింగ్..యాక్సిడెంట్ లో యువతి మృతి..!!
- కొత్త సాఫ్ట్ వేర్తో బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీ







