కొత్త ట్రావెల్ పాలసీకి అనుగుణంగా హోటల్స్ ప్యాకేజీలు
- October 05, 2021
ఖతార్: ఖతార్ ప్రభుత్వం కొత్త ట్రావెల్ పాలసీని ప్రకటించిన విషయం తెలిసిందే. రేపటి నుంచి ఇది అందుబాటులోకి రానుంది. ఈ పాలసీ ప్రకారం రెడ్ లిస్ట్ లో ఉన్న కంట్రీస్ నుంచి వచ్చే వాళ్లు కచ్చితంగా వ్యాక్సిన్ తీసుకొని ఉండాలి. వీరికి రెండు రోజుల హోటల్ క్వారంటైన్ ఉంటుంది. గ్రీన్ లిస్ట్ లో ఉన్న కంట్రీస్ నుంచి వచ్చే వాళ్లకు వ్యాక్సిన్ తీసుకోకపోయిన అనుమతి ఉంది. కానీ 7 డేస్ హోటల్ క్వారంటైన్ లో ఉండాలి. ఐతే అందుకు అనుగుణంగా హోటల్స్ ప్యాకేజీలను ప్రకటించాయి. వీటిని ఖతార్ వచ్చే ప్రయాణికులు బుక్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. డిస్కవర్ ఖతార్ వెబ్ సైట్ ద్వారా ప్రయాణికులు హోటల్స్ ను బుక్ చేసుకోవచ్చు. రెండు రోజుల క్వారంటైన్ కు, ఏడు రోజుల క్వారంటైన్ కు ఆఫర్స్ తో చాలా హోటల్స్ ప్యాకేజీలు ప్రకటించాయి. వీటిని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు. బుధవారం నుంచి ఈ ఆఫర్స్ అందుబాటులోకి రానున్నాయి. రెడ్ లిస్ట్ లో ఉన్న కంట్రీస్ నుంచి వచ్చే 11 ఏళ్ల లోపు పిల్లలు వ్యాక్సిన్ తీసుకోకపోయిన సరే వాళ్లకు అనుమతి ఇచ్చారు. ఐతే రెండు రోజులు క్వారంటైన్ లో ఉండాల్సిందే.
తాజా వార్తలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..







