భౌతిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ బహుమతి ప్రకటన
- October 05, 2021
భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి ప్రకటించారు. ఈ సంవత్సరం భౌతిక శాస్త్రంలో ఏకంగా ముగ్గురికి నోబెల్ బహుమతి వరించింది. శాస్త్రవేత్తలు సుకురో మనాబో, క్లాస్ హసిల్మన్ మరియు జార్జియా పారిసి లను ఈ ఏడాది నోబెల్ బహుమతులకు ఎంపిక చేసినట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ కాసేపటి క్రితమే కీలక ప్రకటన చేసింది.
సంక్లిష్టమైన భౌతిక వ్యవస్థలపై విశ్లేషణలకు గాను వీరికి ఈ ప్రతిష్టాత్మక నోబెల్ అవార్డు ను అందిస్తున్నట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ స్పష్టం చేసింది. అయితే ఇందులో జార్జియా పారిసి కి సగం పురస్కారాన్ని ఇవ్వగా మిగతా సగాన్ని…శాస్త్రవేత్తలు సుకురో మనాబో, క్లాస్ హసిల్మన్ లకు పంచానున్నామని ప్రకటన చేసింది రాయల్ స్వీడిష్ అకాడమీ. భౌతిక శాస్త్రంలో జార్జియా పారిసి చేసిన సేవలకు.. ఆయనకు నోబెల్ బహుమతి సగాన్ని ఇస్తున్నట్లు ప్రకటన చేశారు. కాగా ఉష్ణోగ్రత, స్పర్శ గ్రాహకాలపై పరిశోధనలు జరిపినందుకు గానూ అమెరికన్ శాస్త్రవేత్తలు డెవిడ్ జూలియస్, ఆర్డమ్ పాటపౌటియన్ లకు నోబెల్ వరించిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- గణతంత్ర దినోత్సవం సందర్భంగా లోక్ భవన్లో జరిగిన తేనీటి విందు
- ఖతార్లో ఇండియా ఉత్సవ్.. గణతంత్ర దినోత్సవ వేడుకలు..!!
- భారత దేశవ్యాప్తంగా ఘనంగా గణతంత్ర వేడుకలు..
- కింగ్ ఖలీద్ ఎయిర్ పోర్టు టెర్మినల్ 2 ప్రారంభం..!!
- దుబాయ్లో ఘనంగా రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్..!!
- కువైట్ లో మరో బేబీ ఫార్ములా ఉపసంహరణ..!!
- మస్కట్లో వెల్లివిరిసిన భారత గణతంత్ర స్ఫూర్తి..!!
- బహ్రెయిన్ తేవర్ పెరవై ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం..!!
- బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
- శుభాంశు శుక్లాకు అశోక చక్ర ప్రదానం చేసిన రాష్ట్రపతి







