బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
- January 26, 2026
హైదరాబాద్: బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ & రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (BIACH&RI)లో భారతదేశ 77వ గణతంత్ర దినోత్సవాన్ని అత్యంత గౌరవప్రదంగా, భావోద్వేగపూరితంగా నిర్వహించారు.ఈ సందర్భంగా స్వరపేటిక క్యాన్సర్ కారణంగా లారింజెక్టమీ శస్త్రచికిత్స పొందిన క్యాన్సర్ విజేతలు కలిసి జాతీయ గీతం **“జన గణ మన”**ను ఆలపించి ఒక చారిత్రాత్మక ఘట్టానికి నాంది పలికారు.
బంజారా హిల్స్లోని ఆసుపత్రి ప్రాంగణంలో నిర్వహించిన ఈ విశిష్ట కార్యక్రమంలో, లారింజెక్టమీ సర్వైవర్స్ ఎలక్ట్రోలారింక్స్ పరికరాలు మరియు ట్రాకియో–ఈసోఫేజియల్ వాయిస్ ప్రోస్తెసిస్ (TEP) సహాయంతో సమూహంగా జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ అరుదైన, వినూత్న ప్రయత్నాన్ని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, లండన్ అధికారికంగా ధృవీకరించి, లారింజెక్టమీ సర్వైవర్స్ ద్వారా నిర్వహించిన తొలి సామూహిక జాతీయ గీతాలాపనగా ప్రపంచ రికార్డుగా గుర్తించింది.
కార్యక్రమం జాతీయ పతాక ఆవిష్కరణతో ప్రారంభమై, అనంతరం లారింజెక్టమీ సర్వైవర్స్ గీతాలాపన కార్యక్రమం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ గారు —
శ్రీమతి నందమూరి బసవతారక రామారావు మెమోరియల్ క్యాన్సర్ ఫౌండేషన్ (NBTRMCF) చైర్మన్ & మేనేజింగ్ ట్రస్టీ మరియు ఆంధ్రప్రదేశ్ శాసనసభ గౌరవ సభ్యులు, ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో ఆసుపత్రి బోర్డు సభ్యులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు,జె.ఎస్. ఆర్.ప్రసాద్ ,
సీఈఓ డాక్టర్ కృష్ణయ్య, మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సుబ్రమణ్యేశ్వర రావు,చీఫ్–హెడ్ అండ్ నెక్ ఆంకాలజీ డాక్టర్ ఎల్.ఎం.చంద్రశేఖర రావు,సీనియర్ ఆంకాలజిస్టులు, వైద్య సిబ్బంది మరియు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు పాల్గొన్నారు.
ప్రపంచ రికార్డు గీతాలాపన అనంతరం, లారింజెక్టమీ సర్వైవర్స్ **“వందే మాతరం”**ను ఆలపించి, భారత స్వాతంత్య్ర పోరాట చరిత్రలో ఆ గీతానికి ఉన్న 150 ఏళ్ల విశిష్ట ప్రాధాన్యతను స్మరించుకున్నారు.అనంతరం ఆసుపత్రి యాజమాన్యం లారింజెక్టమీ సర్వైవర్స్ను ఘనంగా సత్కరించింది.
ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ,“సహజ స్వరాన్ని కోల్పోయినప్పటికీ అపారమైన ఆత్మవిశ్వాసంతో లారింజెక్టమీ సర్వైవర్స్ ప్రపంచ రికార్డు సాధించడం దేశానికి గర్వకారణం. ఇది ఆధునిక వైద్యం, పునరావాస చికిత్సలు సాధించిన విజయానికి నిలువెత్తు నిదర్శనం” అని అన్నారు.
ఈ కార్యక్రమం పై డాక్టర్ ఎల్.ఎం.చంద్రశేఖర రావు, చీఫ్–హెడ్ అండ్ నెక్ ఆంకాలజీ, BIACH&RI మాట్లాడుతూ,“టోటల్ లారింజెక్టమీ అనంతరం సమర్థవంతమైన స్పీచ్ థెరపీ, సహాయక పరికరాల సహాయంతో బాధితులు తిరిగి సంభాషణ సామర్థ్యాన్ని పొందగలుగుతారు. ఈ సామూహిక జాతీయ గీతాలాపన వారి ఆత్మగౌరవం, పునరుజ్జీవనం మరియు జీవితం పై గెలుపుకు ప్రతీక” అని తెలిపారు.
తాజా వార్తలు
- జూలై 9 వీసా గడువు: ఎవరి పై ప్రభావం? యూఏఈ స్పష్టీకరణ
- 37 లక్షలు దాటిన చార్ ధామ్ యాత్రికుల సంఖ్య..
- అల్-నాయెమ్ స్క్రాప్ యార్డ్లో అగ్నిప్రమాదం పై అప్డేట్..!!
- ఫాల్ 2026 సీజన్..ఖతార్ మ్యూజియమ్స్ విస్తృతమైన ప్రదర్శనలు..!!
- ముదురుకుంటున్న ఆర్థిక సంక్షోభం పై UNRWA హెచ్చరిక..!!
- సాదియత్ ఐస్లాండ్ లో జెట్ స్కీలను నిషేధించిన అబుదాబి..!!
- ప్రాంతీయ అంతరాయాలను సౌదీ పర్యాటకం అధిగమించింది..!!
- యూఏఈలో 5 రోజుల పాటు అపాయింట్మెంట్లను నిలిపివేసిన ఇండియన్ ఎంబసీ..!!
- విద్వేషపూరిత ప్రసంగాల నిర్మూలనకు ఒమన్ పిలుపు..!!
- పాస్పోర్ట్ సేవల్లో తెలంగాణ పోలీసులకు జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక పురస్కారం







