ఫెడరల్ గవర్నమెంట్ ఉద్యోగులందరికీ ఆరు రోజులు సెలవు
- October 07, 2021
యూఏఈ: దుబాయ్ ఎక్స్ పో 2020 చూడాలనుకునే ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్. ఫెడరల్ గవర్నమెంట్ ఉద్యోగులందరికీ ప్రభుత్వం ఆరు రోజుల పెయిడ్ లీవ్స్ ను మంజూరు చేసింది. యూఏఈ రాజు షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ నేతృత్వంలో కేబినెట్ సమావేశమై ఈ నిర్ణయం తీసుకుంది. యూఏఈ వైస్ ప్రెసెడింట్, యూఏఈ ప్రధాన మంత్రి కూడా సమావేశంలో పాల్గొన్నారు. ఫెడరల్ ప్రభుత్వంలోని ఉద్యోగులంతా వారి కుటుంబ సభ్యులతో కలిసి దుబాయ్ ఎక్స్ పో ను చూడవచ్చని ప్రభుత్వం తెలిపింది. దుబాయ్ ప్రభుత్వం కూడా తమ దేశంలోని ఉద్యోగులకు 6 రోజుల పాటు పెయిడ్ లీవ్స్ మంజూరు చేయటంతో అదే తరహాలో యూఏఈ ప్రభుత్వం కూడా ఉద్యోగులకు సెలవు ప్రకటించింది. యూఏఈ అధ్యక్షుడి మంత్రిత్వ శాఖలో పనిచేసే ఉద్యోగులకు ఇప్పటికే 8 రోజుల పెయిడ్ లీవ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక దుబాయ్ ఎక్స్ పో ఈ నెల 1 ప్రారంభమైంది. వచ్చే ఏడాది 31 వరకు ఇది కొనసాగనుంది.
--బాలాజీ(మాగల్ఫ్ ప్రతినిధి,యూఏఈ)
తాజా వార్తలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..







