ఫెడరల్ గవర్నమెంట్ ఉద్యోగులందరికీ ఆరు రోజులు సెలవు
- October 07, 2021
యూఏఈ: దుబాయ్ ఎక్స్ పో 2020 చూడాలనుకునే ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్. ఫెడరల్ గవర్నమెంట్ ఉద్యోగులందరికీ ప్రభుత్వం ఆరు రోజుల పెయిడ్ లీవ్స్ ను మంజూరు చేసింది. యూఏఈ రాజు షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ నేతృత్వంలో కేబినెట్ సమావేశమై ఈ నిర్ణయం తీసుకుంది. యూఏఈ వైస్ ప్రెసెడింట్, యూఏఈ ప్రధాన మంత్రి కూడా సమావేశంలో పాల్గొన్నారు. ఫెడరల్ ప్రభుత్వంలోని ఉద్యోగులంతా వారి కుటుంబ సభ్యులతో కలిసి దుబాయ్ ఎక్స్ పో ను చూడవచ్చని ప్రభుత్వం తెలిపింది. దుబాయ్ ప్రభుత్వం కూడా తమ దేశంలోని ఉద్యోగులకు 6 రోజుల పాటు పెయిడ్ లీవ్స్ మంజూరు చేయటంతో అదే తరహాలో యూఏఈ ప్రభుత్వం కూడా ఉద్యోగులకు సెలవు ప్రకటించింది. యూఏఈ అధ్యక్షుడి మంత్రిత్వ శాఖలో పనిచేసే ఉద్యోగులకు ఇప్పటికే 8 రోజుల పెయిడ్ లీవ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక దుబాయ్ ఎక్స్ పో ఈ నెల 1 ప్రారంభమైంది. వచ్చే ఏడాది 31 వరకు ఇది కొనసాగనుంది.
--బాలాజీ(మాగల్ఫ్ ప్రతినిధి,యూఏఈ)
తాజా వార్తలు
- చెన్నై పై ఆర్సీబీ ఘనవిజయం
- గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ: సీఎం రేవంత్
- పాన్ కార్డు కొత్త రూల్స్..
- యూఏఈ అధ్యక్షుడు–ఇటలీ ప్రధాని భేటీ
- హైదరాబాద్లో మూడో భారీ బస్ టెర్మినల్
- ‘ఉగాది గీతాంజలి’ వేడుకలో మెరిసిన మలేషియా–భారత సాంస్కృతిక బంధాలు
- లూలూ హైపర్ మార్కెట్ లో షాప్ నౌ, పే లేటర్..!!
- అల్ సువైఖ్లో ఇద్దరు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- మాల్స్ పార్కింగ్ ఏరియాల్లో గాలి నాణ్యతపై కీలక అప్డేట్..!!
- కంపెనీలు ఉద్యోగుల తొలగింపులను నివారించవచ్చా?









