పాకిస్థాన్లో భూకంపం..20 మంది మృతి
- October 07, 2021
పాకిస్థాన్: భూమిపైనే కాదు లోపల కూడా ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దానికి కారణం మనుషులే. అందుకే ఆ పర్యావరణానికి కోపమొచ్చి మనుషులపైకి సునామీలు, భూకంపంలా రూపంలో దూసుకొస్తున్నాయి. ఇటీవల పాకిస్థాన్లో కూడా అదే జరిగింది. గురువారం తెల్లవారుజామున దక్షిణ పాకిస్థాన్లో సంభవించిన భూకంపంలో 20 మంది ప్రాణాలను కోల్పోయారు. తెల్లవారుజామున కాబట్టి ప్రజలు ఈ భూకంపాన్ని వెంటనే గుర్తించలేకపోయారు. మరణించిన వారిలో చాలామంది ఇళ్ల గోడలు కూలి మరణించినవారే. చనిపోయినవారిలో ఒక మహిళ, ఆరుగురు చిన్నారులు ఉన్నట్టు సమాచారం. రిక్టర్ స్కేల్పై భూకంపం తీవ్రత 5.7గా నమోదైంది. భూకంపం ధాటికి 200 మందికి పైగా గాయాలపాలయ్యారు. ఈ ఘటనపై బలూచిస్తాన్ హోంమంత్రి మీర్ జియా ఉల్లా లాంగా స్పందిస్తూ సహాయక చర్యలు చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు.
తాజా వార్తలు
- ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబు వ్యక్తిత్వాలు నేటి తరానికి ఆదర్శం: డైరెక్టర్ రేలంగి
- సైబర్ నేరగాళ్ల వలలో ఐటీ ఉద్యోగి…
- ఇండియాలోనే రష్యన్ ప్యాసింజర్ విమానాల తయారు
- భారీ వర్షం కారణంగా శ్రీనగర్ విమానాశ్రయంలో అన్ని విమానాలు రద్దు
- అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- కువైట్ వెదర్ అలెర్ట్..రెండు రోజులపాటు వర్షాలు..!!
- సోహార్లోని కార్మికుల వసతి గృహంలో అగ్నిప్రమాదం..!!
- ట్రంప్ శాంతి మండలిలో చేరిన ఖతార్..!!
- బంగారం ధర $5,000కి చేరుకుంటుందా?
- బహ్రెయిన్ ఆటమ్ ఫెయిర్..24 దేశాల నుండి 600 మంది ఎగ్జిబిటర్లు..!!







