భారతీయులకు శుభవార్త చెప్పిన బ్రిటన్
- October 08, 2021లండన్: భారతీయులకు బ్రిటన్ అధికారులు శుభవార్త చెప్పారు.గతంలో కోవీషీల్డ్ రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ బ్రిటన్ వచ్చే భారతీయులు తప్పని సరిగా 10 రోజుల పాటు క్వారంటైన్లో ఉండాలని షరతులు విధించిన సంగతి తెలిసిందే.దీనిపై భారత్ ప్రభుత్వం సీరియస్ అయింది.ప్రపంచ ఆరోగ్యసంస్థ అనుమతులు పొందిన వ్యాక్సిన్ తీసుకున్నాక కూడా 10 రోజులు క్వారంటైన్ విధించడం సమంజసం కాదని, క్వారంటైన్ ఆంక్షలు విధిస్తే తాము కూడా అదే బాటలో నడుస్తామని ప్రకటించింది.దీంతో బ్రిటన్ ప్రభుత్వం దిగివచ్చింది. షరతులను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నది.ఎత్తివేసిన షరతులు ఈనెల 11 నుంచి అమలులోకి వస్తాయని బ్రిటన్ ప్రభుత్వం ప్రకటించింది.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం