అవినీతికి పాల్పడిన 271 మంది ఉద్యోగుల అరెస్ట్
- October 08, 2021
సౌదీ అరేబియా: అవినీతి ఉద్యోగులపై సౌదీ యాంటీ కరప్షన్ అథారిటీ (NAZAHA) కొరడా ఝుళిపించింది. అధికార దుర్వినియోగం, లంచం తీసుకుంటూ అక్రమ సంపాదన అర్జిస్తున్న 271 మందిని అరెస్ట్ చేసింది. ఒక్క నెలలో 271 మంది అవినీతి ఉద్యోగులను అరెస్ట్ చేయటం విశేషం. వీరిలో డిఫెన్స్, అంతర్గత వ్యవహారాలు, నేషనల్ గార్డ్, హెల్త్, న్యాయశాఖ, ఆర్థిక శాఖ, మున్సిపల్ అండ్ రూరల్, పర్యావరణ, విద్యా, సోషల్ డెవలప్ మెంట్ డిపార్ట్ మెంట్ కు చెందిన ఉద్యోగులు ఉన్నారు. వీరిపై లంచం, అధికార దుర్వినియోగం కింద అభియోగాలు నమోదు చేశారు. మరో 693 మందిని అవినీతి కేసుల్లో విచారించినట్లు(NAZAHA) తెలిపింది. 10, 329 రైడ్స్ నిర్వహించినట్లు పేర్కొంది.అవినీతి ఉద్యోగులకు సంబంధించి లీగల్ ప్రొసిజర్ కంప్లీట్ చేసి కోర్టుకు అప్పగించినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం







