అవినీతికి పాల్పడిన 271 మంది ఉద్యోగుల అరెస్ట్
- October 08, 2021సౌదీ అరేబియా: అవినీతి ఉద్యోగులపై సౌదీ యాంటీ కరప్షన్ అథారిటీ (NAZAHA) కొరడా ఝుళిపించింది. అధికార దుర్వినియోగం, లంచం తీసుకుంటూ అక్రమ సంపాదన అర్జిస్తున్న 271 మందిని అరెస్ట్ చేసింది. ఒక్క నెలలో 271 మంది అవినీతి ఉద్యోగులను అరెస్ట్ చేయటం విశేషం. వీరిలో డిఫెన్స్, అంతర్గత వ్యవహారాలు, నేషనల్ గార్డ్, హెల్త్, న్యాయశాఖ, ఆర్థిక శాఖ, మున్సిపల్ అండ్ రూరల్, పర్యావరణ, విద్యా, సోషల్ డెవలప్ మెంట్ డిపార్ట్ మెంట్ కు చెందిన ఉద్యోగులు ఉన్నారు. వీరిపై లంచం, అధికార దుర్వినియోగం కింద అభియోగాలు నమోదు చేశారు. మరో 693 మందిని అవినీతి కేసుల్లో విచారించినట్లు(NAZAHA) తెలిపింది. 10, 329 రైడ్స్ నిర్వహించినట్లు పేర్కొంది.అవినీతి ఉద్యోగులకు సంబంధించి లీగల్ ప్రొసిజర్ కంప్లీట్ చేసి కోర్టుకు అప్పగించినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఫ్లైదుబాయ్ విమాన సర్వీసులు రీషెడ్యూల్
- రోడ్లపై వరదనీరు.. కొనసాగుతున్న ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈకి భారీ రెయిన్ అలెర్ట్
- ఉమ్రా వీసా వ్యవధిపై సౌదీ కీలక ఉత్తర్వులు
- ఇరాన్పై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన ఒమన్
- కార్మికులకు కువైట్ శుభవార్త..!
- ఐదు రోజులపాటు తెలంగాణకు వర్ష సూచన
- ఇరాన్ పై ప్రతీకార దాడులకు దిగిన ఇజ్రాయెల్
- కొనసాగుతున్న లోక్సభ ఎన్నికల తొలిదశ పోలింగ్
- ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి: ప్రధాని మోడీ