అవినీతికి పాల్పడిన 271 మంది ఉద్యోగుల అరెస్ట్
- October 08, 2021
సౌదీ అరేబియా: అవినీతి ఉద్యోగులపై సౌదీ యాంటీ కరప్షన్ అథారిటీ (NAZAHA) కొరడా ఝుళిపించింది. అధికార దుర్వినియోగం, లంచం తీసుకుంటూ అక్రమ సంపాదన అర్జిస్తున్న 271 మందిని అరెస్ట్ చేసింది. ఒక్క నెలలో 271 మంది అవినీతి ఉద్యోగులను అరెస్ట్ చేయటం విశేషం. వీరిలో డిఫెన్స్, అంతర్గత వ్యవహారాలు, నేషనల్ గార్డ్, హెల్త్, న్యాయశాఖ, ఆర్థిక శాఖ, మున్సిపల్ అండ్ రూరల్, పర్యావరణ, విద్యా, సోషల్ డెవలప్ మెంట్ డిపార్ట్ మెంట్ కు చెందిన ఉద్యోగులు ఉన్నారు. వీరిపై లంచం, అధికార దుర్వినియోగం కింద అభియోగాలు నమోదు చేశారు. మరో 693 మందిని అవినీతి కేసుల్లో విచారించినట్లు(NAZAHA) తెలిపింది. 10, 329 రైడ్స్ నిర్వహించినట్లు పేర్కొంది.అవినీతి ఉద్యోగులకు సంబంధించి లీగల్ ప్రొసిజర్ కంప్లీట్ చేసి కోర్టుకు అప్పగించినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!







