జెడ్డా ఇస్లామిక్ పోర్ట్ లో సదరన్ టెర్మినల్ ప్రాజెెక్ట్ పనులు ప్రారంభం
- October 09, 2021
రియాద్: జెడ్డా ఇస్లామిక్ పోర్టులో సదరన్ కంటైనర్ టెర్మినల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ ఫస్ట్ ఫేజ్ పనులు ప్రారంభమయ్యాయి. ఈ పనులు దక్కించుకున్న సౌదీ పోర్ట్స్ అథారిటీ (మవానీ), దుబాయ్ పోర్ట్స్ వరల్డ్ ప్రాజెక్ట్ కలిసి గురువారం పనులు మొదలుపెట్టాయి. మొత్తం నాలుగు ఫేజ్ లలో పనులు చేస్తారు. 2024 నాటికి ప్రాజెక్ట్ పూర్తవుతుంది. ఈ ప్రాజెక్ట్ పూర్తైతే జెడ్డా ఇస్లామిక్ పోర్ట్ రూపురేఖలు మారిపోతాయి. ఒకేసారి ఐదు నౌకలను ఇక్కడ నిలపవచ్చు. కంటైనర్ షిప్లలో 26,000 TEU ల లోడ్ కెపాసిటీ పెరుగుతుంది. అంతర్జాతీయ వాణిజ్య, లాజిస్టిక్స్ కు ఇది కేంద్రంగా మారుతుంది. 30 ఏళ్ల పాటు సౌదీ పోర్ట్స్ అథారిటీ, దుబాయ్ పోర్ట్స్ ఆధ్వర్యంలో సదరన్ టెర్మినల్ నడిచేలా ఒప్పందం చేసుకున్నారు. జెడ్డా పోర్ట్ పనితీరు ఏటేటా మెరుగవుతోంది. లాయిడ్స్ లిస్ట్ గతేడాది ర్యాంకింగ్స్ లో ఐదు స్థానాలు మెరుగుపర్చుకొని ప్రపంచంలోనే 37 వ అతిపెద్ద నౌకాశ్రయంగా నిలిచింది.
తాజా వార్తలు
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ







