జెడ్డా ఇస్లామిక్ పోర్ట్ లో సదరన్ టెర్మినల్ ప్రాజెెక్ట్ పనులు ప్రారంభం
- October 09, 2021రియాద్: జెడ్డా ఇస్లామిక్ పోర్టులో సదరన్ కంటైనర్ టెర్మినల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ ఫస్ట్ ఫేజ్ పనులు ప్రారంభమయ్యాయి. ఈ పనులు దక్కించుకున్న సౌదీ పోర్ట్స్ అథారిటీ (మవానీ), దుబాయ్ పోర్ట్స్ వరల్డ్ ప్రాజెక్ట్ కలిసి గురువారం పనులు మొదలుపెట్టాయి. మొత్తం నాలుగు ఫేజ్ లలో పనులు చేస్తారు. 2024 నాటికి ప్రాజెక్ట్ పూర్తవుతుంది. ఈ ప్రాజెక్ట్ పూర్తైతే జెడ్డా ఇస్లామిక్ పోర్ట్ రూపురేఖలు మారిపోతాయి. ఒకేసారి ఐదు నౌకలను ఇక్కడ నిలపవచ్చు. కంటైనర్ షిప్లలో 26,000 TEU ల లోడ్ కెపాసిటీ పెరుగుతుంది. అంతర్జాతీయ వాణిజ్య, లాజిస్టిక్స్ కు ఇది కేంద్రంగా మారుతుంది. 30 ఏళ్ల పాటు సౌదీ పోర్ట్స్ అథారిటీ, దుబాయ్ పోర్ట్స్ ఆధ్వర్యంలో సదరన్ టెర్మినల్ నడిచేలా ఒప్పందం చేసుకున్నారు. జెడ్డా పోర్ట్ పనితీరు ఏటేటా మెరుగవుతోంది. లాయిడ్స్ లిస్ట్ గతేడాది ర్యాంకింగ్స్ లో ఐదు స్థానాలు మెరుగుపర్చుకొని ప్రపంచంలోనే 37 వ అతిపెద్ద నౌకాశ్రయంగా నిలిచింది.
తాజా వార్తలు
- పాకిస్థాన్లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్