జెడ్డా ఇస్లామిక్ పోర్ట్ లో సదరన్ టెర్మినల్ ప్రాజెెక్ట్ పనులు ప్రారంభం
- October 09, 2021రియాద్: జెడ్డా ఇస్లామిక్ పోర్టులో సదరన్ కంటైనర్ టెర్మినల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ ఫస్ట్ ఫేజ్ పనులు ప్రారంభమయ్యాయి. ఈ పనులు దక్కించుకున్న సౌదీ పోర్ట్స్ అథారిటీ (మవానీ), దుబాయ్ పోర్ట్స్ వరల్డ్ ప్రాజెక్ట్ కలిసి గురువారం పనులు మొదలుపెట్టాయి. మొత్తం నాలుగు ఫేజ్ లలో పనులు చేస్తారు. 2024 నాటికి ప్రాజెక్ట్ పూర్తవుతుంది. ఈ ప్రాజెక్ట్ పూర్తైతే జెడ్డా ఇస్లామిక్ పోర్ట్ రూపురేఖలు మారిపోతాయి. ఒకేసారి ఐదు నౌకలను ఇక్కడ నిలపవచ్చు. కంటైనర్ షిప్లలో 26,000 TEU ల లోడ్ కెపాసిటీ పెరుగుతుంది. అంతర్జాతీయ వాణిజ్య, లాజిస్టిక్స్ కు ఇది కేంద్రంగా మారుతుంది. 30 ఏళ్ల పాటు సౌదీ పోర్ట్స్ అథారిటీ, దుబాయ్ పోర్ట్స్ ఆధ్వర్యంలో సదరన్ టెర్మినల్ నడిచేలా ఒప్పందం చేసుకున్నారు. జెడ్డా పోర్ట్ పనితీరు ఏటేటా మెరుగవుతోంది. లాయిడ్స్ లిస్ట్ గతేడాది ర్యాంకింగ్స్ లో ఐదు స్థానాలు మెరుగుపర్చుకొని ప్రపంచంలోనే 37 వ అతిపెద్ద నౌకాశ్రయంగా నిలిచింది.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం