దుబాయ్ ప్రభుత్వం కొత్త హౌసింగ్ స్కీం
- October 10, 2021దుబాయ్: దుబాయ్ ప్రభుత్వం కొత్త హౌసింగ్ స్కీం ను తీసుకొచ్చింది. ఒకే కుటుంబానికి చెందిన వారందరికీ ఒకే చోట ఇళ్లు, స్థలాలను ఇవ్వనుంది. కుటుంబ సభ్యులు, బంధువులు ఎక్కడైతే ఉంటారో అదే ప్రాంతంలో అర్హులకు నివాస స్థలం కేటాయించనున్నారు. ఫ్యామిలీ మెంబర్స్, బంధువులు అంతా ఒక దగ్గరే ఉండాలన్న ఉద్దేశంతో ఈ పథకాన్ని తీసుకొచ్చింది. దీంతో దుబాయ్ ప్రజలు ఫుల్ ఖుషీలో ఉన్నారు. ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. దుబాయ్ రాజకుమారుడు, దుబాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఛైర్మన్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ కొత్త పథకం ద్వారా గ్రాంట్లు, భూమి, హౌసింగ్ యూనిట్లను మార్పు చేసుకోవచ్చని ఆయన అన్నారు. " దుబాయ్ రాజు షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఆదేశాల మేరకు ఒకే ఫ్యామిలీకి ఒకే ప్రాంతంలో నివాస స్థలాన్ని కేటాయించటానికి ప్రాధాన్యత ఇస్తాం. "అని షేక్ హమ్దాన్ ట్వీట్ చేశారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ