భారత్ కరోనా అప్డేట్
- October 11, 2021న్యూ ఢిల్లీ: భారత్లో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. కోవిడ్ సెకండ్ వేవ్ అనంతరం.. కేసుల సంఖ్య భారీగా తగ్గినప్పటికీ మళ్లీ పెరుగుతున్న కేసులు ఆందోళనకు గురిచేశాయి.ఈ క్రమంలో ఉపశమనం కలిగించే విషయం ఏమిటంటే.. 20వేల మార్క్ దాటి నమోదవుతున్న కరోనా కేసులు.. మళ్లీ 20వేలకు దిగువన నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 18,132 కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా 193 మంది మరణించారు. ఉపశమనం కలిగించే విషయం ఎంటంటే.. దాదాపు ఆరు నెలల తర్వాత యాక్టివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గుతూ వస్తోంది. దేశంలో ప్రస్తుతం 2,27,347 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 209 రోజుల తర్వాత యాక్టివ్ కేసులు ఈ స్థాయిలో తగ్గినట్లు కేంద్రం తెలిపింది.
తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,39,71,607 కి పెరిగింది. మరణాల సంఖ్య 4,50,782 కి చేరింది. అయితే.. నిన్న కరోనా నుంచి 21,563 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి దేశంలో ఈ మహమ్మారి నుంచి కోలుకున్న వారి సంఖ్య 3,32,93,478 కి చేరిందని కేంద్రం వెల్లడించింది. కాగా దేశంలో రికవరీ రేటు భారీగా పెరిగినట్లు కేంద్రం తెలిపింది. మార్చి తర్వాత రికవరీ రేటు 98శాతానికి పెరగినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ సోమవారం ఉదయం విడుదల చేసిన హెల్త్ బులెటిన్లో పేర్కొంది.
తాజా వార్తలు
- ఎమిరేట్స్ విమానం ఢీకొని 36 ఫ్లెమింగోల మృతి
- ఏపీలో ఆరోగ్యశ్రీ సేవల నిలిపివేత..హాస్పిటల్స్ అసోసియేషన్ నిర్ణయం
- శ్రీవారి దర్శనం..వీఐపీ టికెట్లు పునఃప్రారంభం
- 20 ఆటోమేకర్ల నుండి వాహనాల దిగుమతిపై సౌదీ నిషేధం
- కారులో యువతి డ్యాన్స్.. డ్రైవర్పై బహిష్కరణ వేటు
- ఎయిర్ టాక్సీలు.. త్వరలో పైలట్ల నియామకం
- యూఏఈలో హెల్త్ సర్వే ప్రారంభం
- జోర్డాన్ను సందర్శించనున్న హెచ్ఎం సుల్తాన్
- ఏడు రెసిడెన్షియల్ భవనాలకు పవర్ డిస్కనెక్ట్
- బెంగళూరు: రేవ్ పార్టీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 100 మంది ప్రముఖలు అరెస్ట్