ఎమిరేట్స్ విమానం ఢీకొని 36 ఫ్లెమింగోల మృతి
- May 21, 2024
ముంబై: ఎమిరేట్స్ విమానం ఢీకొనడంతో 36 ఫ్లెమింగోలు మృతి చెందాయి. ఇవన్నీ ముంబైలోని ఘట్కోపర్ ప్రాంతంలో వివిధ చోట్ల చెల్లాచెదురుగా పడ్డాయి. ఈ ఘటనలో విమానం ముందు భాగం బాగా దెబ్బతింది. సోమవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో జరిగిందీ ఘటన. విమానం దెబ్బతిన్నప్పటికీ సురక్షితంగా ల్యాండ్ కావడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రతి వేసవిలోనూ నవీ ముంబయి పరిసరాల్లో చిత్తడి ప్రాంతాలతోపాటు థానే క్రీక్కు ఫ్లెమింగోలు పెద్ద ఎత్తున వలస వస్తాయి.
విమానం ముంబై ఎయిర్పోర్టులో ల్యాండ్ అవుతున్న సమయంలో ఫ్లెమింగో గుంపును ఢీకొట్టింది. దీంతో అవి పరిసర ప్రాంతాల్లో చెల్లాచెదురుగా పడిపోయాయి.చచ్చిపడిన ఫ్లెమింగోలను చూసిన స్థానికులు వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. పలు ప్రాంతాల నుంచి వరుసగా ఫోన్కాల్స్ రావడంతో వెంటనే స్పందించిన అటవీ అధికారులు పక్షుల కళేబరాలను తీసుకెళ్లారు.చుట్టుపక్కల ప్రాంతాల్లో పక్షల కళేబరాల కోసం గాలించారు. అనంతరం వాటి మరణానికి గల కారణాన్ని తెలుసుకునేందుకు పోస్టుమార్టానికి పంపించారు.
తాజా వార్తలు
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..