ఎమిరేట్స్ విమానం ఢీకొని 36 ఫ్లెమింగోల మృతి
- May 21, 2024
ముంబై: ఎమిరేట్స్ విమానం ఢీకొనడంతో 36 ఫ్లెమింగోలు మృతి చెందాయి. ఇవన్నీ ముంబైలోని ఘట్కోపర్ ప్రాంతంలో వివిధ చోట్ల చెల్లాచెదురుగా పడ్డాయి. ఈ ఘటనలో విమానం ముందు భాగం బాగా దెబ్బతింది. సోమవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో జరిగిందీ ఘటన. విమానం దెబ్బతిన్నప్పటికీ సురక్షితంగా ల్యాండ్ కావడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రతి వేసవిలోనూ నవీ ముంబయి పరిసరాల్లో చిత్తడి ప్రాంతాలతోపాటు థానే క్రీక్కు ఫ్లెమింగోలు పెద్ద ఎత్తున వలస వస్తాయి.
విమానం ముంబై ఎయిర్పోర్టులో ల్యాండ్ అవుతున్న సమయంలో ఫ్లెమింగో గుంపును ఢీకొట్టింది. దీంతో అవి పరిసర ప్రాంతాల్లో చెల్లాచెదురుగా పడిపోయాయి.చచ్చిపడిన ఫ్లెమింగోలను చూసిన స్థానికులు వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. పలు ప్రాంతాల నుంచి వరుసగా ఫోన్కాల్స్ రావడంతో వెంటనే స్పందించిన అటవీ అధికారులు పక్షుల కళేబరాలను తీసుకెళ్లారు.చుట్టుపక్కల ప్రాంతాల్లో పక్షల కళేబరాల కోసం గాలించారు. అనంతరం వాటి మరణానికి గల కారణాన్ని తెలుసుకునేందుకు పోస్టుమార్టానికి పంపించారు.
తాజా వార్తలు
- పీక్ అవర్స్ లో విద్యుత్ వినియోగాన్ని తగ్గించాలి: కువైట్
- బహ్రెయిన్ లో హీట్ వేవ్స్.. ఆరోగ్య నిపుణుల హెచ్చరిక..!!
- అల్ ఖోర్ ఫ్యామిలీ పార్క్ లో ఫ్రీ ఫ్లైట్ పారట్ షో..!!
- సి.ఆర్. మీడియా అకాడమీ సెక్రెటరీ గా బాధ్యతలు చేపట్టిన తేళ్ల కస్తూరి
- 5 రోజుల్లోనే జపాన్ ఈ-వీసా..
- ఫ్యాక్టరీలో విషవాయువు లీక్..ముగ్గురు కార్మికులు మృతి!
- కీసర పోలీస్ స్టేషన్ను సందర్శించిన మల్కాజ్గిరి సీపీ సుమతి
- ఏపీ విద్యార్థులకు తీపికబురు.. జేఈఈ, నీట్ ఉచిత కోచింగ్..
- ఇరాన్, అమెరికా శాంతి చర్చల్లో కుదరని స్పష్టత..
- గుజరాత్ ఆటగాళ్లకు తప్పిన పెను ప్రమాదం









