న్యూస్ రివైండ్: వలస కార్మికుల సమ్మె
- March 18, 2016
ఈ వారం వార్తల్లో పలు ముఖ్యమైన విషయాల గురించి చెప్పుకోవాలంటే అందులో మొదటి స్థానంలో 60 మంది వలస కార్మికులు చేపట్టిన సమ్మె గురించి ప్రస్తావించాలి. గత కొన్ని రోజులుగా వారికి సరైన ఆహారం లేకపోవడం, అలాగే సరైన జీతాలు అందకపోవడంతో విసిగిపోయిన వలస కార్మికులు ఆందోళన బాట పట్టారు. రెండో ముఖ్యమైన అంశం, సరాసరి వేతన పెంపు జీసీసీలోని మిగతా దేశాలతో పోల్చితే ఒమన్లో చాలా తక్కువగా నమోదైంది. గత పదేళ్ళలో ఎన్నడూ లేనంత తక్కువ పెంపు ఈ ఏడాది చోటుచేసుకుంది. పెరుగుతున్న ఖర్చులతో జీవనం ఇబ్బందికరంగా మారుతోంది. ప్రభుత్వం సబ్సిడీ కటింగులతో సామాన్యులు ఇంకా ఇబ్బందులు పడుతున్నారు. మూడో అంశం, పౌరులు మరియు నివాసితులు తాజా పాలకు ఇబ్బంది పడాల్సి వచ్చింది. భారీ వర్షాలతో రవాణా ఇబ్బందులు తలెత్తి తాజా పాలు దొరకని పరిస్థితి ఏర్పడింది. నాలుగోది, మస్కట్ ఐకానిక్ ముట్రా కోర్నిచ్ హై ఆక్టేన్ రేస్ ట్రాక్తో అలరించనుంది. ఏప్రిల్ 8న జరగనున్న ఈ కార్యక్రమం 20,000 మందికి పైగా అభిమానుల్ని అలరించనుంది. ఐదవది, ఔట్ బౌండ్ ఎయిర్లైన్ ప్యాసింజర్స్ 2 ఒమన్ రియాల్స్ని అదనంగా పన్ను రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. జులై 1 నుంచి ఇది అమల్లోకి రానుంది.
తాజా వార్తలు
- రేషన్ కార్డు సేవలు ఇక మీ ఫోన్లోనే
- గూగుల్ మ్యాప్స్లో సరికొత్త AI ఫీచర్లు
- ఇండిగో ప్రయాణికులకు ‘ఇంధన’ భారం
- అటల్ స్మతిన్యాస్ సొసైటీ కార్యచరణ గురించి పలువురితో చర్చించిన వెంకయ్య నాయుడు
- భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- విలువలతో కూడిన రాజకీయాల్లోకి యువత రావాలి: వెంకయ్య నాయుడు
- అమరావతిలో బిట్స్ పిలాని నిర్మాణ ప్లాన్ లను పరిశీలించిన మంత్రి లోకేష్
- అమెరికా విమానం కూలిన ఘటనలో నలుగురు మృతి
- కువైట్లో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- చార్టర్డ్ విమానాలను నిర్వహిస్తున్న ఇండియన్ అసొసియేషన్స్..!!









