న్యూస్ రివైండ్: వలస కార్మికుల సమ్మె
- March 18, 2016
ఈ వారం వార్తల్లో పలు ముఖ్యమైన విషయాల గురించి చెప్పుకోవాలంటే అందులో మొదటి స్థానంలో 60 మంది వలస కార్మికులు చేపట్టిన సమ్మె గురించి ప్రస్తావించాలి. గత కొన్ని రోజులుగా వారికి సరైన ఆహారం లేకపోవడం, అలాగే సరైన జీతాలు అందకపోవడంతో విసిగిపోయిన వలస కార్మికులు ఆందోళన బాట పట్టారు. రెండో ముఖ్యమైన అంశం, సరాసరి వేతన పెంపు జీసీసీలోని మిగతా దేశాలతో పోల్చితే ఒమన్లో చాలా తక్కువగా నమోదైంది. గత పదేళ్ళలో ఎన్నడూ లేనంత తక్కువ పెంపు ఈ ఏడాది చోటుచేసుకుంది. పెరుగుతున్న ఖర్చులతో జీవనం ఇబ్బందికరంగా మారుతోంది. ప్రభుత్వం సబ్సిడీ కటింగులతో సామాన్యులు ఇంకా ఇబ్బందులు పడుతున్నారు. మూడో అంశం, పౌరులు మరియు నివాసితులు తాజా పాలకు ఇబ్బంది పడాల్సి వచ్చింది. భారీ వర్షాలతో రవాణా ఇబ్బందులు తలెత్తి తాజా పాలు దొరకని పరిస్థితి ఏర్పడింది. నాలుగోది, మస్కట్ ఐకానిక్ ముట్రా కోర్నిచ్ హై ఆక్టేన్ రేస్ ట్రాక్తో అలరించనుంది. ఏప్రిల్ 8న జరగనున్న ఈ కార్యక్రమం 20,000 మందికి పైగా అభిమానుల్ని అలరించనుంది. ఐదవది, ఔట్ బౌండ్ ఎయిర్లైన్ ప్యాసింజర్స్ 2 ఒమన్ రియాల్స్ని అదనంగా పన్ను రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. జులై 1 నుంచి ఇది అమల్లోకి రానుంది.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







