ఆది సాయికుమార్ కొత్త సినిమా ప్రారంభం...
- October 16, 2021హైదరాబాద్: ఆది సాయికుమార్ హీరోగా చాగంటి ప్రొడక్షన్లో నూతన చిత్ర ప్రారంభోత్సవం రామానాయుడు స్టూడియోస్ లో వైభవంగా జరిగింది. శివశంకర్ దేవ్ను దర్శకుడిగా పరిచయం చేస్తున్న ఈ మూవీని అజయ్ శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్గా రూపొందబోతున్న ఈమూవీ ఆది సాయికుమార్ కెరీర్లో ప్రత్యేకంగా నిలుస్తుందని అంటుంది చిత్ర యూనిట్.
నిర్మాత పుస్కర రామ్మోహాన రావు.. హీరో ఆది సాయికుమార్ పై క్లాప్ ఇవ్వగా , మరో నిర్మాత కె.యస్ రామారావు కెమెరా స్విచ్ఛాన్ చేసారు. ప్రముఖ నిర్మాతలు సురేష్ బాబు, లగడపాటి శ్రీధర్ , ఈ ప్రారంభోత్సవానికి హాజరై చిత్ర యూనిట్ కి అభినందనలు తెలిపారు. డైలాగ్ కింగ్ సాయికుమార్ ఈ ప్రారంభోత్సవానికి ప్రత్యేక ఆకర్షణ గా నిలిచారు.
పూజా అనంతరం చిత్ర యూనిట్ ప్రెస్తో తమ సినిమా విశేషాలను పంచుకున్నారు.. నిర్మాత అజయ్ శ్రీనివాస్ మాట్లాడుతూః మా నాన్న గారు శాంతయ్య గత 32 సంవత్సరాలుగా డిస్ట్రి బ్యూషన్ రంగంలో ఉన్నారు. కారంచేడు మా స్వగ్రామం . రామానాయుడు ఇన్సిపిరేషన్ తో ఇండస్ట్రీ కి వచ్చిన మా నాన్న నేను నిర్మాతగా మారడానికి ప్రోత్సాహం అందించారు. మంచి కథను రెడీ చేసుకుంటే ప్రొడ్యూసర్ గా అవకాశం ఇస్తానన్నారు. దేవ్ చెప్పిన కథ నాకు బాగా నచ్చడంతో ఆ కథ పై ఒక సంవత్సర కాలంగా పనిచేసాము.
ఆది సాయికుమార్ కెరీర్లో ఈ కథ చాలా ప్రత్యేకంగా నిలుస్తుంది. దర్శకుడు దేవ్ చాలా టాలెంటెడ్ . నాకీ అవకాశం ఇచ్చిన ఆదిసాయికుమార్ కి ప్రత్యేక ధన్యావాదాలు. నిర్మాతగా నా తొలి ప్రయత్నం కి మీ అందరి ఆశీస్సులు కావాలి. నవంబర్ రెండో వారంలో షూటింగ్ మొదలవుతుందని అన్నారు.
దర్శకుడు శివశంకర్ దేవ్ మాట్లాడుతూ... ఇది ఒక క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్. ఆది సాయికుమార్ గారి పాత్ర చాలా ఢిఫరెంట్ గా ఉంటుంది. ఒక కొత్త ఆదిసాయికుమార్ గారిని ఈసినిమా తో చూస్తారు. నాకు అవకాశం ఇచ్చిన ఆది సాయికుమార్ గారికి నిర్మాత అజయ్ శ్రీనివాస్ కి కృతజ్ఞతలు. ఒక కొత్త పాయింట్ తో సినిమా రూపొందబోతుంది. దర్శకుడిగా నా ప్రయత్నం మిమ్మల్ని అందరినీ ఆనంద పరుస్తుందని నమ్ముతున్నాను.
ఆదిసాయికుమార్ మాట్లాడుతూ... నా కెరీర్లో ఈ పాత్ర చాలా ప్రత్యేకంగా ఉంటుంది. కథ వినగానే చాలా ఎగ్జైట్ అయ్యాను. దర్శకుడు చాలా డిటైల్డ్ గా ఈ సినిమా పై పనిచేసాడు. శాంతయ్య గారితో నాకు చాలా సంవత్సరాలుగా స్నేహం ఉంది. ఆయన కుమారుడు నిర్మాతగా నా సినిమా తో పరిచయం అవడం చాలా ఆనందం గా ఉంది. దర్శకుడు దేవ్ తో నాకు రెండు సంవత్సరాలుగా తెలుసు. అందరం కథను నమ్మి ముందుకు వెళుతున్నాం. హీరోయిన్ వివరాలు త్వరలోనే తెలియజేస్తాం. దసరా రోజున నా సినిమా ప్రారంభం కావడం చాలా సంతోషంగా ఉంది.
ఆలి రాజా మాట్లాడుతూ... ఇందులో ఒక పోలీస్ పాత్రను చేస్తున్నాను. నా కెరియర్ లో ఇది ఒక మంచి పాత్రగా మిగులుతుందని నమ్ముతున్నాను. కథ చాలా ఇంట్రెస్ట్ గా ఉంది. ఆది సాయికుమార్ కాంబినేషన్ లో చేయడం చాలా ఆనందంగా ఉంది. అవకాశం ఇచ్చిన నిర్మాత అజయ్ శ్రీనివాస్ కి , దర్శకుడు శివశంకర్ దేవ్ కి థ్యాంక్స్. తారక్ పొన్నప్ప మాట్లాడుతూః ఇందులో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేస్తున్నాను. నా క్యారెక్టర్ లో చాలా వేరియేషన్స్ ఉంటాయి. నటుడిగా ఇది ఒక ఛాలెంజింగ్ రోల్. నా పై నమ్మకంతో అవకాశం ఇచ్చిన దర్శకుడు శివశంకర్ దేవ్ కి నిర్మాత అజయ్ శ్రీనివాస్ కి కృతజ్ఞతలు. కన్నడలో కెజియఫ్, యువరత్న సినిమాలతో మంచి గుర్తింపు వచ్చింది. ఈ పాత్ర తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర చేస్తుందని నమ్ముతున్నాను .
నటీ నటులు: ఆదిసాయికుమార్, అలీ రాజా, నందిని రాయ్, తాకర్ పొన్నప్ప, సాంకేతిక వర్గంః మాటలు : సాయినాథ్ సినిమాటోగ్రఫీ : జిశేఖర్ మ్యూజిక్: అనీష్ సోలోమాన్ పిఆర్ఒ: జియస్ కె మీడియా నిర్మాత: అజయ్ శ్రీనివాస్ దర్శకుడు: శివశంకర్ దేవ్.
తాజా వార్తలు
- 202 మంది బెగ్గర్స్ అరెస్ట్.. విజిట్ వీసా హోల్డర్లే అధికం
- కువైట్ సమాచార శాఖ మంత్రితో భారత రాయబారి భేటీ
- బైట్ అల్ఘాషమ్ దార్అరబ్ ప్రైజ్ కు దరఖాస్తుల ఆహ్వానం
- ఖతార్లో అంతర్జాతీయ నగదు బదిలీపై రుసుములు పెంపు
- పాలస్తీనా భూమి ఆక్రమణ.. తీవ్రంగా ఖండించిన సౌదీ అరేబియా
- పిల్లలకు సోషల్ మీడియా వినియోగం పరిమితం చేయాలా?
- GCC దేశాల కోసం ఇ-వీసాలు.. వ్యాలిడిలీ, డాక్యుమెంట్ ప్రాసెస్
- వార్షిక సౌదీ గ్రీన్ ఇనిషియేటివ్ డే.. లక్ష్యాలను ప్రకటించిన సౌదీ అరేబియా
- అజాన్ లేదా ప్రార్థనల పై తప్పుడు ప్రచారం.. ఖండించిన షార్జా
- విదేశీ కంపెనీలలో పౌరుల నియమకం..ఒమన్ కీలక ఉత్తర్వులు