దుబాయ్ వ్యాపారవేత్తను హత్య చేసిన నిందితులను అరెస్టు చేసిన పోలీసులు
- October 16, 2021
హైదరాబాద్: హైదరాబాద్లో దుబాయ్ వ్యాపారవేత్తను హత్య చేసిన నలుగురు నిందితులను తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు. దక్షిణ మండలం (హైదరాబాద్) డిప్యూటీ పోలీసు కమిషనర్ (DCP) గజరావు భూపాల్ ప్రకారం.. హైదరాబాద్ చాంద్రాయణగుట్ట ప్రాంతానికి చెందిన రాయీస్ జాబ్రి, ఆదిల్ జాబ్రీ, సయ్యద్ సలేహ్ జాబ్రి, సాద్ బిన్ సలేహ్ జాబ్రి దుబాయ్ వ్యాపారవేత్తను హత్య చేశారు. ప్రధాన నిందితుడు రయీస్ జాబ్రీ దుబాయ్లో పనిచేశాడు. 2019 లో రయీస్ జాబ్రి ఇండియాకు తిరిగి వస్తుండగా.. దుబాయ్ వ్యాపారవేత్త అతనికి తెలియకుండా కిలో బంగారం ఉన్న బ్యాగ్ని దుబాయ్ నుండి భారతదేశంలో డెలివరీ చేయడానికి ఇచ్చాడు. అయితే విమానాశ్రయంలో అతడిని కస్టమ్ అధికారులు అరెస్టు చేశారు. విచారణ సమయంలో దుబాయ్ వ్యాపారవేత్త తనకు ఆర్థిక సాయం, ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చాడని కానీ అలా చేయలేదని, అందుకే దుబాయ్ ఎన్నారై ను కత్తితో పొడిచి చంపామని నిందితుడు రయీస్ విచారణలో చెప్పాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు DCP గజరావు భూపాల్ మాగల్ఫ్ న్యూస్ కు తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..







