దుబాయ్‌ వ్యాపారవేత్తను హత్య చేసిన నిందితులను అరెస్టు చేసిన పోలీసులు

- October 16, 2021 , by Maagulf
దుబాయ్‌ వ్యాపారవేత్తను హత్య చేసిన నిందితులను అరెస్టు చేసిన పోలీసులు

హైదరాబాద్‌: హైదరాబాద్‌లో దుబాయ్‌ వ్యాపారవేత్తను హత్య చేసిన నలుగురు నిందితులను తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు. దక్షిణ మండలం (హైదరాబాద్) డిప్యూటీ పోలీసు కమిషనర్ (DCP) గజరావు భూపాల్ ప్రకారం.. హైదరాబాద్ చాంద్రాయణగుట్ట ప్రాంతానికి చెందిన రాయీస్ జాబ్రి, ఆదిల్ జాబ్రీ, సయ్యద్ సలేహ్ జాబ్రి, సాద్ బిన్ సలేహ్ జాబ్రి దుబాయ్‌ వ్యాపారవేత్తను హత్య చేశారు. ప్రధాన నిందితుడు రయీస్ జాబ్రీ దుబాయ్‌లో పనిచేశాడు. 2019 లో రయీస్ జాబ్రి ఇండియాకు తిరిగి వస్తుండగా.. దుబాయ్ వ్యాపారవేత్త అతనికి తెలియకుండా కిలో బంగారం ఉన్న బ్యాగ్‌ని దుబాయ్ నుండి భారతదేశంలో డెలివరీ చేయడానికి ఇచ్చాడు. అయితే విమానాశ్రయంలో అతడిని కస్టమ్ అధికారులు అరెస్టు చేశారు. విచారణ సమయంలో దుబాయ్  వ్యాపారవేత్త తనకు ఆర్థిక సాయం, ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చాడని కానీ అలా చేయలేదని, అందుకే దుబాయ్ ఎన్నారై ను కత్తితో పొడిచి చంపామని నిందితుడు రయీస్ విచారణలో చెప్పాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు DCP గజరావు భూపాల్ మాగల్ఫ్ న్యూస్ కు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com