వ్యాక్సిన్ స్విచ్చింగ్ తో మెరుగైన ఫలితాలు.. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ నివేదిక
- October 17, 2021
సౌదీ: రెండు వేర్వేరు కోవిడ్ 19 వ్యాక్సిన్లు తీసుకుంటే కొత్త కరోనా వేరియంట్లతో పోరాడే శక్తి మెరుగు అవుతుందని మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ఓ నివేదికను విడుదల చేసింది. ఒకే వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న వారి కంటే రెండు వేరువేరు వ్యాక్సిన్ డోస్ లు తీసుకున్నవారిలో మెరుగైన ఫలితాలు వచ్చినట్లు ఈ నివేదిక స్పష్టం చేసింది. ఇప్పటికే యునైటెడ్ కింగ్డంలో ప్రవేశపెట్టిన ఈ వ్యాక్సిన్ స్విచ్చింగ్ విధానం మెరుగైన ఫలితాలు ఇస్తుందని నివేదికలో ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. వ్యాక్సిన్ లను మార్చడం వల్ల రోగనిరోధక శక్తి బలోపేతం అవుతుందని, ఇది కరోనా వేరియంట్లలోని వివిధ భాగాలతో మరింత ప్రభావవంతంగా పోరాడటానికి సహాయంగా ఉంటుందని హెల్త్ మినిస్ట్రీ తన నివేదికలో వివరించింది. వ్యాక్సిన్ మార్చడం వల్ల శరీరం యొక్క నిరోధకతను నిరోధించడానికి ఉపయోగపడుతుందని పేర్కొంది. కాగా ఇప్పుడున్న వ్యాక్సిన్ల విధానాలను మార్చే ఉద్దేశ్యం లేదని హెల్త్ మినిస్ట్రీ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ
- బహ్రెయిన్లో న్యాయ సేవలకు ఈ-పేమెంట్ సర్వీస్..!!
- ఒమన్లో విద్యుత్ కేబుళ్ల చోరీ.. నలుగురి అరెస్టు..!!
- కువైట్లో కార్మికుల హక్కులకు మరింత రక్షణ..!!







