చెన్నై విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత
- October 17, 2021
చెన్నై: చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుకున్నారు.దుబాయ్, షార్జా ప్రయాణీకుల వద్ద 1.20 కోట్ల విలువ చేసే 2 కేజీల బంగారం గుర్తించారు కస్టమ్స్ అధికారులు. కస్టమ్స్ అధికారులకు ఏమాత్రం అనుమానం రాకుండా బంగారాన్ని పేస్టుగా మార్చి.. ఆ పేస్టు ను క్యాపసల్స్ లో నింపారు కేటుగాళ్లు. అయితే ప్రాణాలకు తెగించి క్యాపసల్స్ రూపంలో వున్న బంగారాన్ని మలద్వారంలో దాచారు కంత్రిగాళ్లు. అయితే చెన్నై విమానాశ్రయంలో విమానం దిగగానే దర్జాగా బయటకు చెక్కేసే ప్రయత్నం చేసారు ఐదుగురు ముఠా సభ్యులు. వారి నడవడికలో అనుమానం రావడంతో ఐదుగురుని అదుపులోకి తీసుకొని తమదైన స్టైల్ లో విచారణ చేసింది కస్టమ్స్ బృందం. దాంతో మలద్వారం లో దాచిన బంగారం గుట్టును రట్టు చేసిన కస్టమ్స్ అధికారులు.ఆ బంగారం సీజ్ చేసి ఐదుగురి పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసుతున్నామని కస్టమ్స్ అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 7 దాడుల కథనంపై స్పందించిన ఎమిరేట్స్..!!
- సౌదీలో 5 రోజులపాటు వర్షాలు.. ప్రజలకు హెచ్చరిక..!!
- యూకేలో టెక్నికల్ ప్రాబ్లమ్.. ఖతార్ ఎయిర్వేస్ విమానాలకు అంతరాయం..!!
- లుసైల్ మరీనా ఇంటర్సెక్షన్ వద్ద యూ-టర్న్ మూసివేత..!!
- యూరోపియన్ దేశాల ప్రకటనను స్వాగతించిన ఒమన్..!!
- సౌదీపై హౌతీ దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- షువైఖ్ ఇండస్ట్రియల్ ఏరియాలో తనిఖీలు.. 74 సంస్థలపై చర్యలు..!!
- ఇరాన్ ట్యాంకర్లను ధ్వంసం చేసిన అమెరికా.. ప్రతీకారంగా ఇరాన్ మిసైల్ దాడులు
- బీసీసీఐ అసోసియేట్ స్పాన్సర్గా ChatGPT..!
- భారత్–కువైట్ వ్యూహాత్మక భాగస్వామ్యంపై కీలక చర్చలు







