ఉమ్రా కంపెనీలపై జరిమానాలను రద్దు
- October 22, 2021
సౌదీ: వీసా నిబంధనలను ఉల్లంఘించారని పలు ఉమ్రా కంపెనీలకు విధించిన జారిమానాలను మక్కాలోని అడ్మినిస్ట్రేటివ్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్ రద్దు చేసింది. జరిమానా విధించే విషయంలో సంబంధిత అధికారులు నిబంధనలు పాటించలేదని ఉమ్రా కంపెనీలు అప్పిల్స్ కోర్టులో అప్పీల్ చేయడంతో ఈ మేరకు జరిమానాలను రద్దు చేస్తూ కోర్టు తుది తీర్పు వెలువరించింది. ఆరు గంటలు ఆలస్యంగా యాత్రికులు వచ్చారంటూ ఎనిమిది మంది ఉమ్రా ఆపరేటర్లపై అధికారులు చర్యలు తీసుకున్నారు. వీసా నిబంధనలను ఉల్లంఘించారంటూ సంబంధిత అధికారులు జరిమానాలు విధించారు. యాత్రికులు ఆలస్యంగా రావడం అనేది తమ నియంత్రణలో లేని అంశం అని.. జరిమానా నిర్ణయాన్ని సమీక్షించాలని కోరుతూ ఆపరేటర్లు.. హజ్, ఉమ్రా మంత్రిత్వ శాఖను ఆశ్రయించారు. వీసా ఉల్లంఘనకు సంబంధించిన అన్ని నిబంధనలను పరిశీలించిన తర్వాత జరిమానాలను రద్దు చేస్తూ కోర్టు తన తీర్పును వెలువరించింది.
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







