రెడ్ సిగ్నల్ జంప్ చేస్తే తప్పదు భారీ మూల్యం

- October 23, 2021 , by Maagulf
రెడ్ సిగ్నల్ జంప్ చేస్తే తప్పదు భారీ మూల్యం

యూఏఈ: సిగ్నల్ జంప్ చేసే వాహనాలకు ఇకపై భారీగా జరిమానాలు వేయనున్నారు. రోడ్ సేఫ్టీ నిబంధనలు పాటించకుండా రెడ్ లైట్ పడ్డప్పుడు ఆగకుండా సిగ్నల్ జంప్ చేస్తే  51, వేల దిర్హామ్స్, 12 ట్రాఫిక్ పాయింట్లు ఫైన్ వేయనున్నట్టు అబుధాబి పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడిన వారికి 1,000 దిర్హామ్స్ జరిమానా, 12 బ్లాక్ పాయింట్లు వేయనున్నారు. సిగ్నల్ సిగ్నల్ జంప్ చేస్తూ పట్టుబడ్డ వాహనాన్ని వదిలేందుకు 50,000 దిర్హామ్స్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే వాహనాన్ని నడిపిన వారి లైసెన్స్ ఆరు నెలల పాటు సస్పెండ్ చేస్తారు. మూడు నెలల్లో ఫీజు, జరిమానా పూర్తిగా చెల్లించాలి.  లేదంటే సీజ్ చేసిన వాహనాలను వేలం వేస్తామని అబుధాబి పోలీసులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com