వచ్చే ఏడాది నాటి అన్ని స్కూళ్లలో డిజిటల్ ఎంపావర్ మెంట్ తప్పనిసరి
- October 23, 2021
మనామా: వర్చువల్ క్లాస్ రూమ్స్ నిర్వహణ తో సెంట్రల్ వర్చువల్ క్లాస్ రూమ్స్ పై ఎఫెక్ట్ తగ్గిందని నేషనల్ అడిట్ ఆఫీస్ తన 18 వ యాన్వల్ రిపోర్ట్ లో తెలిపింది. వర్చువల్ క్లాస్ రూమ్స్ లో క్రౌడ్ ఎక్కువగా ఉండటంతో స్టూడెంట్స్ కొంత నేర్చుకోవటం తగ్గిందని తెలిపింది. సెంట్రల్ వర్చువల్ క్లాస్ రూమ్ లలో చదువుకున్న పిల్లలు గ్రేడ్ పరంగా ముందున్నట్లు గుర్తించారు. ఈ ఏడాదిలో దాదాపు 45 స్కూళ్లను నేషనల్ అడిట్ కమిటీ సందర్శించింది. స్కూళ్లలో టెక్నాలజీ, ఇంటర్ నెట్ కు సంబంధించిన సౌకర్యాలను పరిశీలించింది. చాలా స్కూళ్లు ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలను పాటించటం లేదని అధికారులు తెలిపారు. అదే విధంగా వర్చువల్, డిజిటల్ క్లాస్ ల నిర్వహణకు కావాల్సిన సదుపాయాలు కూడా చాలా స్కూళ్లలో లేవంట. టెక్నాలజీ కి సంబంధించి ఉద్యోగులకు కూడా సరైన నాలెడ్జ్ లేదని గుర్తించారు. ఇక 45 స్కూళ్లలో ఐతే వైర్ లెస్ నెట్ వర్క్ లేదని అధికారులు రిపోర్ట్ లో తెలిపారు. కరోనా మహమ్మరి కారణంగా ఎలక్ట్రానిక్ ట్రాన్స్ మిషన్ అనేది తప్పనిసరి అయింది. అందుకు తగిన విధంగా అన్ని స్కూళ్లు కూడా టెక్నాలజీని సమకూర్చుకోవాలని కమిటీ కోరింది. టెక్నికల్ గా ఎడ్యుకేషన్ ను నేర్పేందుకు అవసరమైన నాలెడ్జ్ ను టీచర్లు అప్ డేట్ కావాలని కోరింది. అదే విధంగా వచ్చే ఏడాది నాటికి అన్ని స్కూళ్లలో డిజిటల్ ఎంపావర్ మెంట్ కోసం కృషి చేయాలని రిపోర్ట్ లో కోరింది.
తాజా వార్తలు
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు







