దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫా పై బతుకమ్మ
- October 23, 2021
_1635006024.jpg)
_1635006005.jpg)
యూఏఈ: తెలంగాణ పూల పండుగ బతుకమ్మ నేడు ప్రపంచ దృష్టిలో పడింది. ప్రపంచ ప్రఖ్యాత 'బుర్జ్ ఖలీఫా' పై బతుకమ్మ పాటను ప్రదర్శించి యావత్ తెలుగు ప్రజల మన్నలను అందుకున్నారు కల్వకుంట్ల కవిత. ఈ ప్రదర్శనలో బతుకమ్మ ప్రాశస్త్యం, విశిష్టత, సంబురాల సంస్కృతిని కళ్ళకు కట్టినట్టు చూపించారు. ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు యూఏఈ లోని తెలుగు ప్రజలు పెద్దఎత్తున రావటం జరిగింది. తమ సంస్కృతికి అద్దం పట్టే బతుకమ్మ ను ఇలా ప్రపంచపు స్క్రీన్ పై చూడటం నిజంగా ఒక గొప్ప అనుభూతి అని ప్రజలు కొనియాడారు.
షుమారు మూడు నిమిషాల నిడివి గల ఈ షో ను రెండు సార్లు ప్రదర్శించి ప్రతి ఒక్కరు చూసే విధంగా ఏర్పాటు చేయటం జరిగింది.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఆర్టీసీ చైర్మన్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఎంపీ సురేష్ రెడ్డి, పీయూసీ చైర్మన్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, ఎమ్మెల్యేలు గణేష్ గుప్తా, జాజాల సురేందర్, షకీల్, డా. సంజయ్, తెలంగాణ సంఘాలు మరియు జాగృతి ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.



_1635006050.jpg)


తాజా వార్తలు
- లెబనాన్ పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం...
- ఇరాన్ సంచలన నిర్ణయం
- కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు
- తెలంగాణలో కొత్త ఎయిర్పోర్టులు..కేంద్రం కీలక ప్రకటన
- IPL ఆటగాళ్లకు బీసీసీఐ కొత్త రూల్స్
- ఏవియేషన్ విద్యార్థులకు అంతర్జాతీయ ఇంటర్న్షిప్ అవకాశం
- యూఏఈలో పర్యటించనున్న కేంద్ర మంత్రి జైశంకర్
- సీఎం రేవంత్ రెడ్డితో టాటా లాక్హీడ్ మార్టిన్ ఎండీ భేటీ
- కాగజ్నగర్ రైల్వే బ్రిడ్జి నిర్మాణంలో ప్రమాదం
- అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ..స్వాగతించిన భారత్









