దుబాయ్ టిక్కెట్టుతో ఉచిత కోవిడ్ 19 పీసీఆర్ టెస్ట్ పొందే అవకాశం

- October 25, 2021 , by Maagulf
దుబాయ్ టిక్కెట్టుతో ఉచిత కోవిడ్ 19 పీసీఆర్ టెస్ట్ పొందే అవకాశం

దుబాయ్: ఎమిరేట్స్ ఎయిర్‌లైన్ ప్రయాణీకులు, ఉచితంగా పిసిఆర్ టెస్టుని దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకోగానే పొందవచ్చు. తద్వారా వారు ఎక్స్‌పో 2020 దుబాయ్ ప్రాంతానికి ఎలాంటి ఇబ్బందీ లేకుండా చేరుకోవడానికి వీలవుతుంది. ఎయిర్‌లైన్ టిక్కెట్ ద్వారా ఎక్స్‌పో సందర్శన టిక్కెట్ కూడా ఉచితమే. దాన్ని వారు ఎంట్రీ వద్ద చూపించాల్సి వుంటుంది. ఇమ్మిగ్రేషన్ హాలుకి సమీపంలోనే టెస్టింగ్ లాంజ్ ఏర్పాట చేశారు. 72 గంటల ముందు తీసుకున్న పీసీఆర్ నెగెటివ్ టెస్టు ఫలితం వుంటేనే ఎక్స్‌పోలోకి ప్రవేశం కల్పిస్తారు. అక్టోబర్ 1 నుంచి మార్చి 31 వరకు ఎమిరేట్ విమానంలో ప్రయాణించేవారు ఎక్స్‌పో ప్రాంతానికి ఉచితంగా పాస్ పొందుతారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com